

గూడూరు,( మన న్యూస్) తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని నెర్నూరు గ్రామములోని ప్రాథమికోన్నత పాఠశాలలో 6,7,8, తరగతులను ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న తిరువెంగనాయపల్లి పాఠశాలకు తరలించవద్దు అని బుధవారం రోజు విద్యార్థుల తల్లిదండ్రులు, కె.వి.పి.ఎస్ అడపాల ప్రసాద్ ఆధ్వర్యంలో పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్న పలంగా 47 మంది ఇక్కడ చదువుతున్న విద్యార్థులను ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న తిరువెంగ నాయపల్లి పాఠశాలకు మార్చడం ఏమిటని వారు ప్రశ్నించడం జరిగింది. అంతదూరం మా పిల్లలు వెల్లరేరని పాఠశాలలు ప్రారంభమైన జూన్ 12వ తేదీ నుండి 15 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆయా గ్రామాలలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆ పాఠశాలకు వెళ్ళనీయ కుండా నిలిపి చేయడం జరిగింది. దీనితో ఆ పాఠశాల ప్రాంగణం విద్యార్థులు లేక వెల,వెల బోతూ తరగతి గదులలో ఖాళీ బెంచీలు, నోట్ బుక్స్, ఉపాధ్యాయులకు దర్శనమిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తును సౌకర్యాలను, దృష్టిలో పెట్టుకొని ఎక్కడ చదువుతున్న వాళ్లని అక్కడే నిలుపుదల చేయాలని వారి తల్లిదండ్రులు కె.వి.పి.ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్ మెంట్ చైర్మన్ దాసరి మోహన్, నాయకులు బి.వి.రమణయ్య,పామంజి మణి,ఆర్.శ్రీనివాసులు,ఏంబేటి చంద్రయ్య,కె.ధనమ్మ, ఎస్.నరసమ్మ,పి.లక్ష్మి దేవమ్మ, సి.హెచ్.రమేష్,డి.మల్లికార్జున, దాసరి శీనయ్య,పల్లం రాజు, బి. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
