ఎల్ఏ సాగరం చెరువు బఫర్ జోన్‌లో అక్రమ లేఅవుట్లు!మున్సిపాలిటీ, తుడా నిబంధనలకు తూట్లు

గూడూరు, మన న్యూస్:ఎల్ఏ సాగరం చెరువు పరిసరాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డాగా మారాయి. బఫర్ జోన్‌లను లెక్కచేయకుండా, చెరువు కట్టలను పరిగణనలోకి తీసుకోకుండా రెవెన్యూ, మున్సిపాలిటీ, తుడా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా లేఅవుట్లు వెలుసుతున్నాయి.పచ్చని పంట పొలాలు ప్రైవేటు డెవలపర్ల చేతిలో ప్లాట్లుగా రూపాంతరం చెందుతున్నాయి. కన్వర్షన్ లేకుండా, మున్సిపాలిటీ ఆమోదం లేకుండానే ప్లాట్ల విక్రయాలు సాగిపోతున్నాయి. మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన పది శాతం ఓపెన్ స్పేస్‌ను కూడా హాంపట్ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు.ఈ అక్రమాలకు పాల్పడుతున్న రియల్టర్లు ప్రభుత్వానికి తగినంత పన్నులు చెల్లించకుండా ఆదాయాన్ని దాచేస్తున్నారు. అయితే, మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు మాత్రం ఈ అక్రమాలను చూసి చూసీ మౌనంగా ఉండటం స్థానికుల్లో అనుమానాలకు తావిస్తోంది.భారీ వర్షాలు వస్తే చెరువు ముంపు ప్రాంతంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు భద్రంగా ఉండరన్నదే వాస్తవం. అయినా కూడా బఫర్ జోన్‌లో ప్లాట్లకు అనుమతులు ఎలా వచ్చాయోనన్న ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి పడుతుండగా, అధికారులు మాత్రం శీతల వైఖరి ప్రదర్శించడంలో ఆంతర్యం ఏమిటన్నది అందరికీ తలపొలికే విషయమవుతోంది.

  • Related Posts

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- పేదల పక్షాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం లో శంఖవరం మండలం మరియు వివిధ గ్రామాలకు చెందిన 12…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    తుని మన న్యూస్ (అపురూప్) తుని గురుకులంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శ్రీకాకుళంలోని ఐ.ఐ.ఐ.టి లో సీట్లను కైవసం చేసుకుని ప్రతిభను కనబరిచారని తుని అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యదర్శి సూర్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    • By RAHEEM
    • June 25, 2025
    • 2 views
    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    • By RAHEEM
    • June 25, 2025
    • 6 views
    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.