

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ మంత్రివర్యులు బోస్ రాజు డెబ్బై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర విధాన సభ స్పీకర్ UT. ఖాదర్, న్యాయశాఖ మంత్రి HK.పాటిల్, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరియు రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిసి బోస్ రాజు జీవిత చరిత్ర చైతన్య సాగర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ మంత్రివర్యులు బోస్ రాజు గద్వాల ఎమ్మెల్యే శాలువా కప్పి పుష్పగుచ్చం భగవద్గీత పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గద్వాల నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు,జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్ మాజీ జెడ్పిటిసి రాజశేఖర్ మాజీ వైస్ ఛైర్మన్ రామకృష్ణ నాయుడు, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి చంద్రశేఖర్, నవీన్ రెడ్డి, యుగంధర్ గౌడ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
