తాళలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల రిమాండ్ – డీఎస్పీ నల్లపు లింగయ్య

మన న్యూస్,నారాయణపేట జిల్లా:జిల్లా పరిధిలోనీ మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడు తున్న ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని సోమవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పి నల్లపు లింగయ్య నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన సుబ్బమ్ విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి తేది:11.11.2024 నాడు వివాహానికి హాజరై తిరిగి వచ్చే సరికి ఇల్లు తాళం పగలగొట్టి దొంగతనం జరిగింది అనే ఫిర్యాదు మేరకు మక్తల్ ఎస్సై కేసు నమోదు చేయగా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆదేశాలతో డీఎస్పీ పర్యవేక్షణలో మక్తల్ సీఐ, ఎస్సై క్రైమ్ పార్టీతో దర్యాప్తు ప్రారంభించారు. నారాయణపేట రోడ్ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా మక్తల్ పోలీసులు పట్టుకొని విచారించగా వారి పేరు A1 మహమ్మద్ గౌస్ s/o నబీ సబ్, వయస్సు 25 సంలు, నటరాజ్ కాలనీ, సింధనూర్ టౌన్ రాయచూరు, జిల్లా కర్ణాటక రాష్ట్రం. A2 రాయచూర్ హనుమంత s/o ఈశ్వరప్ప వయస్సు 38 సం.లు దేవదుర్గ గ్రామం, రైచూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారూ, తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి మొదటగా రక్కీ చేసి తర్వాత దొంగతనాలకు పాల్పడుతుండేవారని వీరు అంతర్రాష్ట్ర నేరస్తులను ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, దేవరకద్ర, మరికల్, మక్తల్ లో దొంగతనాలు చేశారని, కర్ణాటక రాష్ట్రంలో కూడా దొంగతనాలకు పాల్పడ్డారని, అనేక కేసులలో ముద్దాయిలుగా ఉండి జైలు కూడా వెళ్లొచ్చారని వారి వద్ద నుండి 05 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందని వాటి విలువ సుమారు 4,50,000/- రూపాయలు ఉంటుందని డిఎస్పి అన్నారు.ఇలా పలు దొంగతనాల కేసులలో దొంగలు ఉన్న వీరిని ఈరోజు రిమాండ్ తరలించడం జరిగిందని డిఎస్పి తెలిపారు. దొంగతనం కేసులను ఛేదించిన వారిలో మక్తల్ సీఐ రామ్లాల్, ఎస్సైలు భాగ్యలక్ష్మి రెడ్డి, SM నవీద్, క్రైమ్ పోలీసులు అశోక్, శ్రీకాంత్, నరేష్, శశి మొదలగు వారిని డీఎస్పీ అభినందించారు.

Related Posts

ఆర్యవైశ్య సంఘం,మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షికోత్సవ వేడుకలు

మీర్పేట్. మన న్యూస్: కర్మన్ ఘాట్ డివిజన్లోని మందమల్లమ్మ ఎక్స్ రోడ్ సాయిరాం నగర్ కాలనీలోని లక్ష్మీ కన్వెన్షన్ లో ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య బంధుమిత్రులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ…

తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

ఎల్ బి నగర్. మన న్యూస్ తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్లో గుడిమెట్ల రజిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముప్పాళ్ళ నాగేశ్వరరావు ,(ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ

వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ

అదే అభిమానం ..అదే ఆప్యాయత ..ఏ ఇంటికి వెళ్లిన సొంత బిడ్డల ఆదరణ…….. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

అదే అభిమానం ..అదే ఆప్యాయత ..ఏ ఇంటికి వెళ్లిన సొంత బిడ్డల ఆదరణ…….. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పంతో ఉన్నత లక్ష్యాలు…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పంతో ఉన్నత లక్ష్యాలు…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యం ……కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యం ……కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి