నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలి

మన న్యూస్, తిరుపతి:– మంత్రి నారా లోకేష్ కు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వినతి. ఆంధ్రరాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు బుధవారం రేణిగుంట విమానశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం వినతిపత్రం అందజేశారు. సత్యవేడులో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన మంత్రి శ్రీ నారా లోకేష్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ ధన్వంతరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని క్షౌరశాలలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు జీవో అమలు చేసి ఆదుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కు భారీగా నిధులను కేటాయించి వారి సంక్షేమం అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేసారు. అలాగే శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆదోనికి చెందిన నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలని గౌరవ మంత్రివర్యులకు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం గారు వినతి పత్రం అందజేశారు.

Related Posts

భాను ఆర్టో & చెస్ట్ హాస్పిటల్ ను కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

కావలి మన న్యూస్ : కావలి పట్టణంలో నూతనంగా అన్ని హంగులతో నిర్మించిన భాను ఆర్థో & చెస్ట్ హాస్పిటల్ ను కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి గారితో కలిసి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ప్రారంభించారు. గురువారం…

ప్రభుత్వ మెడికల్ క్యాంపును సందర్శించిన టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్

ప్రభుత్వ మెడికల్ క్యాంపును సందర్శించిన టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్ శంఖవరం మన న్యూస్ (అపురూప్):- అతిసార వ్యాధి లక్షణాలు కలిగి ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించాలని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ అధికారి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భాను ఆర్టో & చెస్ట్ హాస్పిటల్ ను కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

భాను ఆర్టో & చెస్ట్ హాస్పిటల్ ను కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ప్రభుత్వ మెడికల్ క్యాంపును సందర్శించిన టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్

ప్రభుత్వ మెడికల్ క్యాంపును సందర్శించిన టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్

జనసేన క్రియా వాలంటీర్లకు సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన మేడిశెట్టి సూర్యకిరణ్

జనసేన క్రియా వాలంటీర్లకు సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన మేడిశెట్టి సూర్యకిరణ్

విజయ వంతంగా ముగిసిన ఎన్ సి సి నేవల్ క్యాంపు

విజయ వంతంగా ముగిసిన ఎన్ సి సి నేవల్ క్యాంపు

ఘనంగా పద్మశ్రీ ఆచార్య బండి రామకృష్ణారెడ్డి కర్మక్రియలు -పలువురు ప్రముఖులు పాల్గొని శ్రద్ధాంజలి అర్పణ

ఘనంగా పద్మశ్రీ ఆచార్య బండి రామకృష్ణారెడ్డి కర్మక్రియలు -పలువురు ప్రముఖులు పాల్గొని శ్రద్ధాంజలి అర్పణ

మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు స్వాగ‌తం

మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు స్వాగ‌తం