భ‌క్తుల‌కు అసౌక‌ర్యం లేకుండా గంగ‌మ్మ‌ ద‌ర్శ‌నంఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః– తాత‌య్య‌గుంట గంగమ్మ జాత‌ర వైభ‌వంగా ప్రారంభ‌మైయ్యాయి. చాటింపు త‌రువాత బుధవారం భ‌క్తులు భైరాగి వేషంతో అమ్మ‌వారికి మొక్కులు చెల్లించుకున్నారు. బుధ‌వారం సాయంత్రం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు గంగ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. భ‌క్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాలను ఆల‌య అధికారులు, ఉత్స‌వ‌క‌మిటీ స‌భ్యుల‌తో క‌లిసి ఎమ్మెల్యే ప‌రిశీలించారు. ఆల‌యప్రాంగ‌ణంలో జ‌రుగుతున్న అభివృద్ధిప‌నుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. భ‌క్తుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిభిరాన్ని ఎమ్మెల్యే ప‌రిశీలించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. బైరాగి వేషం వేసుకున్న పిల్ల‌ల కోరిక మేర‌కు వాళ్ళ‌తో ఎమ్మెల్యే ఫోటో దిగారు. కాగా భ‌క్తుల‌కు మెరుగైన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డ‌మే త‌మ మొద‌టి ప్రాధాన్య‌త అని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. సామాన్యుల‌కు శీఘ్ర‌గ‌తిన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డంతో పాటు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం చేసుకునే వారికి ప్ర‌త్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. మొద‌టి రోజు ప‌దివేల మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నార‌ని ఆయ‌న చెప్పారు. గురువారం బండ వేషంతో అమ్మ‌వారిని భ‌క్తులు మొక్కులు తీర్చుకోనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో గంగమ్మ జాతర ఉత్సవ కమిటీ నాయకులు బండారి బాలసుబ్రమణ్యం రెడ్డి, నైనార్ మహేష్ యాదవ్, జలపోతు చంద్రశేఖర్ రెడ్డి, అశోక్, ఆవులపాటి బుజ్జిబాబు జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి, కూట‌మి నాయ‌కులు, అధికారులు, పాల్గొన్నారు.

Related Posts

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

శంఖవరం/ రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మేమున్నాం అంటూ గంగవరం గ్రామ ఆడపడుచులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంకా మానవత్వం బతికే ఉన్నాది అనేదానికి ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..