రాజ్యాంగ బద్దంగా రైతుకు వ్యాపారితో సమానంగా హక్కులు కల్పించాలి

Mana News – తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్. ఆర్.అల్వార్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు బ్యాంకుల వద్దకు భూమిని తాకట్టు పెట్టుకొని అప్పు ఇచ్చే వ్యవస్థ మన దగ్గర లేదు. వ్యాపారస్తుల విషయంలో మాత్రం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తున్నారు. బ్యాంకులు రైతులకు కేవలం పంటలను పెట్టుబడిన మాత్రమే ఇస్తున్నారు. పంట రుణము పెట్టుబడి రుణము మాత్రమే ఇస్తున్నారు.ఇలా సగం రుణాలు మాత్రం ఇవ్వడం వలన వచ్చిన రుణాన్ని రైతు తన నిత్యవసరాలకు వాడుకొని పెట్టుబడి సమయం వచ్చేసరికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర మూడు రూపాయలకు ఐదు రూపాయలకు వడ్డీ తీసుకువచ్చి వ్యవసాయంపై పెట్టుబడి పెడుతున్నాడు. పంటలో నష్టం ఏర్పడినప్పుడు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.రైతు యొక్క భూమిని రెవెన్యూ వాల్లు వేరే వాళ్లకు అక్రమ పట్టా చేస్తే బాధిత రైతుకు న్యాయం చేసేది ఎవరు. కోర్టుకు వెలితే అక్రమ పట్టాదారులపైన శిక్ష వేయదు. రెవెన్యూ అధికారులపైన శిక్ష వేయదు, అంటే రైతును మోసం చేసిన వారిపై చర్యలు ఉండవు. అంటే చట్టం తనపని తామ చేయదు రైతు విషయంలో, వ్యాపారిని మోసం చేస్తే చట్టం తనపని తాను చేస్తుంది. వ్యాపారిని మోసం చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాయి. అంటే రైతుకు మోసం చేయడానికి అందరికి హక్కు ఉంది. న్యాయం చేయడానికి ఎవరు లేరు.రైతును మోసం చేస్తే అంటే రైతు యొక్క భూమిని అప్పు ఇస్తామని మోసం చేసి, భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే పోలీసులు కేసు నమోదు చేయరు. దీన్నిబట్టి రైతుకు న్యాయం చేయడానికి పోలీసులు సిద్ధంగా లేరు. బ్యాంకులు కుదువబెట్టుకొని అప్పు ఎకరాకు లక్ష రూపాయలు మాత్రమే ఇస్తారు. అంటే కోటి రూపాయల భూమికి లక్ష రూపాయలు మాత్రమే ఇస్తారు. బంగారం కుదువపెట్టుకుంటే 60 శాతం లోను ఇస్తారు. కాని రైతుకు 1 శాతం మాత్రమే ఇస్తారు. అది వంట ఋణం ఇవ్వకుంటే మాత్రమే అందువల్ల రైతు ప్రైవేటు వ్యాపారులకు భూమిని అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తేనే ఎకరాకు 5లక్షలు మాత్రమే అప్పు ఇవ్వడానికి ఒప్పుకుంటారు, కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కు వెలితే కేసు నమోదు చేయడానికి ఒప్పుకోరు, రెవెన్యూ అధికారుల దగ్గరకు వెలితే న్యాయం చేయరు. అంటే రైతులకు పోలీసులు న్యాయ సహాయం చేయరు, బ్యాంకులు అప్పులు ఇవ్వవు, రైతుల భూములను అక్రమ పట్టా చేసిన వారిపై మరియు అక్రమ పట్టా చేసుకున్న వారిపైన కోర్టులు శిక్ష వెయ్యవు.

డిమాండ్లు :-
1) రైతులను మోసం చేసినవారిపై సివిల్ కేసు కాదు. క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
2) ఎకరాకు పంట ఋణం లక్ష రూపాయలు ఇవ్వాలి.
3) ఎకరా భూమి కుదువ పెట్టుకొని 40 లక్షల ఋణం ఇవ్వాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ పెట్టుకోవడానికి
4) అసైన్మెంట్ చట్టం ఆర్.ఓ. ఆర్. చట్టం సీలింగ్ యాక్ట్ ఆర్.టి.ఏ యాక్ట్ చట్టాలను దిక్కరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి.
5) రైతుకు చట్టబద్ధంగా ఇన్సూరెన్స్ కల్పించాలి.
6) ఒట్టిపోయిన పాడి ఆవులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.

Related Posts

వేసవి విజ్ఞాన తరగతులను సద్వినియోగం చేసుకోండి – నర్వ, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్

మన న్యూస్ నర్వ మండలం:- వేసవి విజ్ఞాన తరగతులను విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నర్వ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ తెలిపారు. నర్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శిబిరంలో విద్యార్థులకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల…

బొలెరో వాహనం బీభత్సం ఇద్దరు నర్సింగ్ కాలేజీ విద్యార్థుల మృతి పలువురు విద్యార్థులకు గాయాలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 29: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో మక్తల్ కు చెందిన మహేశ్వరి (20),వనపర్తికి చెందిన మనీషా శ్రీ(21) అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

139 వ మేడే, జెండాను ఆవిష్కరించిన లిబరేషన్ పార్టీ నాయకులు.

139 వ మేడే, జెండాను ఆవిష్కరించిన లిబరేషన్ పార్టీ నాయకులు.

బద్వేల్ లో కార్మికుల ప్రదర్శన— ఏఐటీయూసీ— నాగ సుబ్బారెడ్డి.

బద్వేల్ లో కార్మికుల ప్రదర్శన— ఏఐటీయూసీ— నాగ సుబ్బారెడ్డి.

బ్రహ్మంగారిమఠం రెవెన్యూలో రికార్డులు మాయం— AIYF— పెద్దులపల్లి ప్రభాకర్.

బ్రహ్మంగారిమఠం రెవెన్యూలో రికార్డులు మాయం— AIYF— పెద్దులపల్లి ప్రభాకర్.

ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే నేల సారవంతం..

ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే నేల సారవంతం..

పదవ తరగతి టాపర్ మురళి అభినందించిన జిల్లా కలెక్టర్…

పదవ తరగతి టాపర్ మురళి అభినందించిన జిల్లా కలెక్టర్…

దివ్యాంగురాలు వనజకు బైకును అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస

దివ్యాంగురాలు వనజకు  బైకును అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస