ప్రతి భూ సమస్యను పరిష్కరించడం కోసం భూభారతి చట్టం -పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు -భూబారతి చట్టంపై ప్రతి ఒక్కరికి సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి -జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్

పినపాక, మన న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో రైతుల భూములకు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జీతీష్ వి పాటిల్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ భూభారతి చట్టం ఈ నెల 14 వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు తెలిపారు. భూభారతి చట్టం ద్వారా ప్రజలకు వేగంగా సేవలందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూములకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను సివిల్ కోర్టు ద్వారా మాత్రమే పరిష్కరించాల్సి ఉంటుంది అని అన్నారు. భూభారతి చట్టం ద్వారా ఇలాంటి అంశాలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ లో అప్పీల్ చేయడానికి అవకాశం లేదని, కేవలం సివిల్ కోర్టు ద్వారానే పరిష్కరించడానికి అవకాశం ఉందని, ఈ భూ భారతి చట్టం ద్వారా పిర్యాదు ఆధారంగా ఆర్డిఓ, కలెక్టర్ ద్వారా పరిష్కరించడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ఏ విధంగా ఆధార్ కార్డు ఉందో భూములకు కూడా ప్రభుత్వం భూదాన్ కార్డు జారీ చేస్తారు అని ఆయన అన్నారు. ప్రతి మండలంలో జరుగుతున్న అవగాహన సదస్సులలో పాల్గొని భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ అవగాహన సదస్సులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యక్తం చేశారు. అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆర్డిఓ దామోదర్, తహసిల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీవో సునీల్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, అధికారులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ