ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రతకమిషన్ చైర్మన్ చిత్తూరు జిల్లా లో విస్తృత పర్యటన

మన న్యూస్, గంగాధర్ నెల్లూరు,మార్చి 04:– మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాపరెడ్డి చిత్తూరు జిల్లా లో విస్తృత పర్యటన చేశారు.. చిత్తూరు జిల్లా పర్యటన లో భాగంగా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు,ఎఫ్ పి షాప్ లు,పి హెచ్ సి లు అంగన్వాడీ కేంద్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప రెడ్డి పర్యటించారు. చిత్తూరు జిల్లా లో విస్తృత పర్యటనలో భాగంగా పూతలపట్టు,పెనుమూరు, ఎస్ ఆర్ పురం, గంగాధర నెల్లూరు, బంగారుపాళ్యం మండలాలలోని, ఎఫ్ పి షాప్ లు, అంగన్వాడీ కేంద్రాలు, ఎండియు వాహనాల తనిఖీ,పి హెచ్ సి లు పరిశీలించారు. గంగాధర నెల్లూరు మండలం లో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాల నిర్వహణపై ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పిల్లలకు బాల్యం చాలా ముఖ్యమైన ఘట్టామని, చదువు చాలా ముఖ్యమని, చదువుకోవడం వలన వారి జీవితం మెరుగుపడుతుందని అందరూ బాగా చదువుకోవాలని తెలిపారు. పౌర సరఫరాల శాఖ ద్వారా పొందే బియ్యం నాణ్యతను పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వం రేషన్, స్కూల్స్, ఐ సి డి ఎస్ లకు నాణ్యమైన బియ్యం ను అందజేస్తుందని, ఇంట్లో అన్నం వండేటప్పుడు గంజి వంచవద్దని అత్తెసరు పద్దతిలో అన్నం వండుకోవాలని, ఇలా చేయడం వల్ల ఆహారంలోని పౌష్టికత పుష్కలంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించి మంచి నిర్ణయాలతో పాలు, గుడ్లు, వంటి అధిక విటమిన్, ప్రోటీన్ లు కలిగిన ఆహారాన్ని పిల్లలకు అందిస్తుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చదువులో ముందడుగు వేస్తారని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారు బాలలకు తొలిదశ నుండే అబివృద్ది పధం లో నడిపేందుకు పైలట్ ప్రాజెక్టులు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమములో డీఎస్ఓ శంకరన్, డిఎం సివిల్ సప్లై బాలకృష్ణ,జిల్లా విద్యాశాఖాధి కారి వరలక్ష్మి,ఐ సి డి ఎస్ అధికారి వెంకటేశ్వరి , సాంఘీక, వెనుకబడిన సంక్షేమ శాఖ డి డి లు చెన్నయ్య, రబ్బానీ భాషా మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!