శ్రీ సీతారాముల మందిర పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ

మన న్యూస్ తవణంపల్లె జులై-22:         మండలంలోని వెంగంపల్లెలో వెలసిన పురాతన సీతా రాముల దేవస్థానానికి మహర్దశ వచ్చింది. 150 సంవత్సరాల పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంగంపల్లె గ్రామస్తులు చిత్తూరు ఎండోమెంటు కమిషనర్కు నూతన ఆలయం నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ఎండోమెంట్ కమిషనర్ వెంగంపల్లెలోని పురాతన సీతారాముల ఆలయాన్ని పరిశీలించి అంచనాలు వేసి రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్కు ప్రతిపాదనలు పంపారు. దేవదాయశాఖ మంత్రి అనుమతితో ఎండోమెంట్ కమిషనర్ సీజీఎఫ్(కన్జర్వేషన్ గ్రాంట్ ఫండ్స్)స్కీం కింద ఆగమశాస్త్రం ప్రకారం నూతన సీతారాముల దేవస్థానం నిర్మించడానికి రూ.88 లక్షలు మంజూరు చేసింది. గ్రామస్తుల కాంట్రిబ్యూషన్ కింద రూ.22 లక్షలు నిధులు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గ్రామస్తులు రూ.22 లక్షలు నిధులు విరాళాలు చెల్లించడానికి ముందుకు వచ్చారు. వెంగపల్లెలో పురాతన ఆలయస్థానంలో నూతన గుడి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎండోమెంట్ అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఎల్బీనగర్లో ప్రమాదం

ఎల్బీనగర్లో ప్రమాదం

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ