గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆ కార్యక్రమం అంతరం శ్రీ సరస్వతి టాలెంట్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన బోనాల వేడుకకు పాఠశాల యజమాన్యం మాకం బీచుపల్లి గారి ఆహ్వాన మేరకు మందకృష్ణ మాదిగ విచ్చేసి చెట్టును నాటడంతో పాటు పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన ఆతిథ్యం స్వీకరించి బోనాల వేడుకలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకత్వం, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *