

సమస్యని ప్రభుత్వ అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కరించగలగే శక్తి జర్నలిజం – పాస్ అధ్యక్షులు దగ్గోలు సురేంద్రబాబు
గూడూరు,మన న్యూస్ :- గూడూరు సీనియర్ జర్నలిస్ట్ స్వామి 66వ జన్మదిన సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ డాక్టర్ సయ్యద్ తాజుద్దీన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా తాజుద్దీన్ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ స్వామి ప్రతి సమస్యని వార్త రూపంలో పరిష్కరించే తత్వం కలిగిన వారు ఈ జర్నలిజంలో తనకంటూ గూడూరు నియోజకవర్గంలో ప్రత్యేక స్థానాన్ని పొందారు. ఇప్పుడున్న యువ జర్నలిస్టులు స్వామి నీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. కరప్షన్ నీ ప్రశ్నించి మార్చగలిగే ఏకైక శక్తి జనలిజం. జర్నలిజం లో పూర్తిస్థాయిలో గూడూరు లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న స్వామిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే పాస్ అధ్యక్షులు దగ్గోలు సురేంద్రబాబు మాట్లాడుతూ స్వామి అన్న మాకు చాలా ఆప్తులు మేము చేసే సోషల్ సర్వీస్ లో ప్రతి సమస్యని ఆయన వార్తలు రూపంలో అధికారులకు చేరేలా సమస్య పరిష్కరించే అంతవరకు పోరాడే గొప్ప జర్నలిస్ట్ ఈతరం యువ జర్నలిస్టులు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ప్రజల సమస్య కొరకు జననిజం సృష్టించబడింది జర్నలిజం అంటే ప్రజల్లో ఉన్న ఒక గొప్ప నమ్మకం, ఏ డిపార్ట్మెంట్లో అయినా కరప్షన్ ని ప్రశ్నించి వార్తలు రూపంలో అధికార వద్దకు తీసుకెళ్లడమే జర్నలిజం యొక్క లక్ష్యం సీనియర్ జర్నలిస్ట్ సోమన్న ఒక సమస్యని పూర్తిగా వివరణ తెలుసుకొని వార్త రూపంలో రాసి ఆ సమస్యని అధికారులు చెంతకు చేరేలా చెయ్యగలిగే ఏకైక వ్యక్తి సోమన్న జర్నలిజం అంటే ఇలా ఉండాలని అప్పట్లో సమస్య అధికారులే కాదు జర్నలిజం చేతిలో కూడా పరిష్కారం అవుతాయని అప్పట్లో మేము నమ్మామంటే దానికి కారణం సోమన్న ఎన్నో సమస్యలు వార్తలుగా మలిచి పరిష్కరించిన ఏకైక వ్యక్తి మా సోమన్నని గర్వంగా చెప్పుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఆయన తెలిపారు.