చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలి – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూన్ 24:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం చోడి పంటకు మంచి మద్దతు ధర ప్రకటించిందని రైతులు దళారులను నమ్మి పంటలు వేయొద్దని గొట్టూరు సర్పంచ్ మాదల సింహాచలం అన్నారు గొట్టూరు రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న పంట వైపు మళ్లుతున్నారని నీటి సదుపాయం లేని మొక్కజొన్న ఆర్థికంగా లాభదాయకంగా ఉండదని దాని స్థానంలో ఎలాంటి ఖర్చులు లేని చిరుధాన్యాలను సాగు చేసుకోవాలని కోరారు రైతులు ఒకే పంట కాకుండా పలు పంటలు వేసుకోవాలని గట్లు మీద పండ్ల మొక్కలు కూరగాయలు సాగు చేసుకోవాలని అంతర పంటలు అభివృద్ధి చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని ప్రకృతి సేద్య పంటలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని కాబట్టి రైతులు ప్రకృతి సేద్యం దిశగా మల్లాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన రైతులకు 90% రాయితీపై విత్తనాలు అందిస్తుందని అలాగే కంది పంట చిరు సంచులను ఉచితంగా అందజేస్తుందని కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు అనంతరం రైతులు మాట్లాడుతూ 20 మంది వరకు పిఎం కిసాన్ లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదని అలాగే ఈ సంవత్సరం ఉలవ పంటకు మద్దతు ధర తో కొనుగోలు చేపట్టాలని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు గ్రామ వ్యవసాయ సహాయకులు భారతి కిరణ్ ప్రకృతి సేద్య ఉద్యోగులు సురేష్ అప్పన్న మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

మ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని గంటవారిపల్లి పంచాయతీకి చెందిన ముఠాలం గ్రామంలో గత కొద్ది రోజులుగా తాగునీరు సమస్య ఉండడంతో స్థానిక సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కు ముఠాలం గ్రామంలో నీటి సమస్య ఉందని ఆయన…

పొలం పిలుస్తోంది

మన న్యూస్ సింగరాయకొండ:- నిన్న పొలం పిలుస్తోంది లో భాగంగా సోమరాజు పల్లి మరియు సింగరాయకొండ లలో గ్రామసభ లు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇ .నిర్మల కుమారి పాల్గొనుట జరిగినది. ఆమె…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

మ్మెల్యే థామస్ చొరవతో ముఠాలం గ్రామంలో ద్రాహం తీర్చిన సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి

పొలం పిలుస్తోంది

పొలం పిలుస్తోంది

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని సత్కారం

గేదెల దొంగతనం కేసు నమోదు ఇద్దరు నిందితులు అరెస్ట్, రూ.3.5 లక్షల విలువైన గేదెలు రికవరీ

గేదెల దొంగతనం కేసు నమోదు ఇద్దరు నిందితులు అరెస్ట్, రూ.3.5 లక్షల విలువైన గేదెలు రికవరీ

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: ఆలంపూర్ సీఐ రవి బాబుజిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,IPS ఆదేశాల మేరకు

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: ఆలంపూర్ సీఐ రవి బాబుజిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,IPS ఆదేశాల మేరకు

రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌లుః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌లుః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు