

గూడూరు, మన న్యూస్:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమము ను పాలిచెర్ల మరియు పాలిచెర్ల రాజుపాలెం గ్రామాలలో నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు , గూడూరు బి. గోపి నాయక్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా, మారుతున్న టెక్నాలజీని రైతులకు చేరవేసే విస్తరణ కార్యక్రమమే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమము అని రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
మండల వ్యవసాయ అధికారి గూడూరు, వి.రమేష్ పచ్చి రొట్ట మరియు పి.ఎం.డి.ఎస్ కిట్లును సబ్సిడీ పై త్వరలో రైతులకు అందజేయడం జరుగుతుందని , ఇవి భూసారం పెంపుదలకు ఎంతగానో తోడ్పడతాయని , అలాగే నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతాయి కావున ప్రతి రైతు కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఉద్యాన అధికారిణి యన్. సునీత ఉద్యాన శాఖలో అమలవుతున్న వివిధ విస్తరణ పథకాల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు కె .శివ, గ్రామ నాయకులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.
