

ఎల్బి నగర్. మన న్యూస్ : ఎల్బీనగర్ నియోజకవర్గం డివిజన్ లోని చంపాపేట్ డివిజన్ గౌర్నమెంట్ ప్రెస్ కాలనీ పార్క్ సెంటర్ ఆధ్వర్యంలో సాయిరాం నగర్ కాలనీ పార్కులో సీనియర్ యోగా గురూజీ లక్ష్మణ జోన్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి, గవర్నమెంట్ ప్రెస్ కాలనీ సెంటర్ ఇన్ఛార్జ్ కె.లక్మారెడ్డి,సాయిరాం నగర్ కాలనీ యోగ పార్క్ ఇన్చార్జ్ కే శ్రీనివాస్ రెడ్డి, ఎం గోపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథులుగా చంపాపేట్ డివిజన్ బిజెపి అధ్యక్షులు పోరెడ్డి రవీందర్ రెడ్డి,సాయిరాం నగర్ కాలనీ ప్రెసిడెంట్గుర్రం సుధాకర్ రెడ్డి, అంజిరెడ్డి నగర్ కాలనీ ప్రెసిడెంట్ యస్ రఘుపతి రెడ్డి, హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుభవజ్ఞులైన యోగా గురువు యోగా ఆసనాలు, శ్వాస నియంత్రణ పద్ధతులు (ప్రాణాయామం) అందరికీ మార్గ నిర్దేశం చేశారు. అనంతరం యోగా గురూజీ ఎల్ మాధవరెడ్డి మాట్లాడుతూ యోగా మన శరీరం, మనస్సు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. ఇలాంటి ఆరోగ్య కేంద్రిత కార్యక్రమాలు సామాజికంగా చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రతి ఒక్కరూ రోజూ యోగా చేసేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు. *అనంతరం మహిళ యోగ గురూ*కె.లక్ష్మి, తో పాటు మహిళ యోగ సాధకురాళ్ళు రాధిక*, *సంతోషి, వసుధ రెడ్డి,**స్టేజ్ పై యోగసనాల తో వారి* *నైపుణ్యాన్ని చాటుకున్నారు* యోగ దినోత్సవ వేడుకలో సుమారు 200 మందికి పైగా యోగ సాధకులు మహిళ యోగ సాధకురాళ్ళు హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో షిఖర ఎన్క్లేవ్ చల్ల శ్రీనివాస్ రెడ్డి,చంద్రపాల్ రెడ్డి,బాలాపూర్ శ్రీనివాస్ రెడ్డి.రాజిరెడ్డి,గోపాల్ రెడ్డి,మూల వెంకటేశ్వర రెడ్డి,మేక రవీంద్ర రెడ్డి. నారాయణ గుప్తా , లింగేశ్వర్ గుప్తా, రత్నకుమార్ గుప్తా, వెంకటేష్ గుప్త, విశ్వనాథ్ గుప్తా(విష్ణు) పాటిల్ చరణ్,మహిళ యోగ సాధకురాళ్ళుతదితరులు పాల్గొన్నారు.
