

మన న్యూస్ చిత్తూరు జూన్-14
చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాల (అటానమస్) ఆర్ వి ఎస్ నగర్ బి.ఫార్మసీ విద్యార్థుల పట్టభద్రుల వేడుక ఘనంగా నిర్వహించబడం జరిగింది. విద్యార్థుల విద్యార్హతలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం, విద్యార్థుల స్ఫూర్తిని రెట్టింపు చేస్తోంది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా అపోలో మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ హాజరై, విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. “పరిశ్రమల్లో నాణ్యతతో పాటు నైతిక విలువలూ అంతే ముఖ్యమైనవి. నేటి యువత విజ్ఞానంతో పాటు మానవతా విలువలను కూడా పెంపొందించుకోవాలి,” అని ఆయన వ్యాఖ్యానించారు.
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం తరఫున హాజరైన డాక్టర్ దేవన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, మెరుగైన విద్యతో దేశాభివృద్ధిలో యువత పాత్రపై వివరించారు.
కళాశాల వైస్ చైర్మన్ రావూరి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోతీస్వరి కూడా విద్యార్థులను ఆశీర్వదిస్తూ, కళాశాల వారు అందిస్తున్న విద్యా ప్రమాణాలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం, సాంస్కృతిక కార్యక్రమాలు, మెరిట్ అవార్డుల పంపిణీ, సర్టిఫికేట్ల అందజేత నిర్వహించబడింది. విద్యార్థుల కృషిని అభినందిస్తూ కళాశాల వేదిక గొప్ప మైలురాయిగా నిలిచింది.
