రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలి-కృష్ణ ఎస్సై నవీద్

మన న్యూస్, నారాయణ పేట:– నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే రైతులకు విక్రయించాలని నకిలీలు అంటగడితే కేసులు నమోదు చేస్తామని కృష్ణ ఎస్సై ఎస్ ఎం నవీద్ తిపారు.కృష్ణ మండల కేంద్రంలోని విత్తనాలు & ఎరువుల దుకాణాలలో అకస్మిక తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో ఉన్న విత్తనాల స్టాక్‌ వివరాలను, ఎరువులు, పురుగు మందులను పరిశీలించారు. అదేవిధంగా విత్తనాలకు సంబంధించిన బిల్లు పుస్తకాలు, డెలివరి చలాన్‌లను, మార్కెటింగ్‌ అగ్రిమెంట్‌, వచ్చిన స్టాక్‌, విత్తనాల విక్రయ రిజిస్టర్, లాట్ రిజిస్టర్, రైతు విక్రయ రిజిస్టర్, లైసెన్స్ సక్రమంగా వున్నాయ లేదా అని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్సై ఎస్ ఎం నవీద్ మాట్లాడుతూ,రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా పకడ్బంది చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీల విత్తనాల పేరుతో నాసి రకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదన్నారు. రైతులు సైతం విత్తనాలు కొనుగోలు సమయంలో అప్రమత్తత పాటిస్తూ ..కొనుగోలు రశీదు తీసుకోవాలని సూచించారు. డీలర్లు, ఫెర్టిలైజర్ షాపు యజమానులు రైతులకు నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధిత పురుగు మందులు విక్రయిచవద్దని, రైతులకు నష్టం కలిగేలా వ్యవహారింవద్దని అన్నారు. మార్కెట్ లో నకిలీ విత్తనాల విక్రయం జరుగకుండా టాస్క్ ఫోర్స్ బృందాల నిరంతరం పర్యవేక్షణ వుంటుందని తెలిపారు. కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి, తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి రైతులను మోసం చేస్తారని, ఇటువంటి వారిపై గ్రామాల్లో సైతం నిఘా పెట్టామని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే మండల వ్యవసాయ శాఖ అధికారికి గాని స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.

Related Posts

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి