మన న్యూస్, నారాయణ పేట:- నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే రైతులకు విక్రయించాలని నకిలీలు అంటగడితే కేసులు నమోదు చేస్తామని కృష్ణ ఎస్సై ఎస్ ఎం నవీద్ తిపారు.కృష్ణ మండల కేంద్రంలోని విత్తనాలు & ఎరువుల దుకాణాలలో అకస్మిక తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో ఉన్న విత్తనాల స్టాక్ వివరాలను, ఎరువులు, పురుగు మందులను పరిశీలించారు. అదేవిధంగా విత్తనాలకు సంబంధించిన బిల్లు పుస్తకాలు, డెలివరి చలాన్లను, మార్కెటింగ్ అగ్రిమెంట్, వచ్చిన స్టాక్, విత్తనాల విక్రయ రిజిస్టర్, లాట్ రిజిస్టర్, రైతు విక్రయ రిజిస్టర్, లైసెన్స్ సక్రమంగా వున్నాయ లేదా అని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్సై ఎస్ ఎం నవీద్ మాట్లాడుతూ,రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా పకడ్బంది చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నాసి రకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదన్నారు. రైతులు సైతం విత్తనాలు కొనుగోలు సమయంలో అప్రమత్తత పాటిస్తూ ..కొనుగోలు రశీదు తీసుకోవాలని సూచించారు. డీలర్లు, ఫెర్టిలైజర్ షాపు యజమానులు రైతులకు నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధిత పురుగు మందులు విక్రయిచవద్దని, రైతులకు నష్టం కలిగేలా వ్యవహారింవద్దని అన్నారు. మార్కెట్ లో నకిలీ విత్తనాల విక్రయం జరుగకుండా టాస్క్ ఫోర్స్ బృందాల నిరంతరం పర్యవేక్షణ వుంటుందని తెలిపారు. కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి, తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి రైతులను మోసం చేస్తారని, ఇటువంటి వారిపై గ్రామాల్లో సైతం నిఘా పెట్టామని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే మండల వ్యవసాయ శాఖ అధికారికి గాని స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.