బింగినపల్లిలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలో KVK, కందుకూరు ఆధ్వర్యంలో “వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి KVK సైంటిస్ట్ డా. ఐ. వెంకటేష్, మండల వ్యవసాయాధికారి సుధాకర్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయాధికారి సుధాకర్ మాట్లాడుతూ, పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు కావలసిన రైతులు తమ గ్రామ రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాల వివరాలు రైతులకు తెలియజేశారు.డా. ఐ. వెంకటేష్ మాట్లాడుతూ, తెల్ల చవుడు నియంత్రణకు జీలుగ వేనుకొని పూతకు ముందు నేలలో కలియదున్నాలని, మట్టి పరీక్షల ఆధారంగా పోషకాల యాజమాన్యం చేపట్టాలని సూచించారు. జీవన ఎరువులు, అజొల్లా, భాస్వరాన్ని మరియు పొటాస్‌ను కలిగించే బ్యాక్టీరియా వాడాలని, సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వివరించారు.
పశువుల పేడ పెంచిన ట్రైకోడెర్మా వంటి జీవ శిలీంద్రాలు నేల వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని చెప్పారు. సమగ్ర సస్య రక్షణలో భాగంగా లింగాకర్షణ బుట్టలు, రంగు అట్టలు, పక్షిస్థావరాలు, రక్షక పంటలు, జీవ కీటకనాశనులు, సరైన మోతాదులో రసాయనాలు వాడాలని సూచించారు. పొలాల్లో కలుపు నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సీనియర్ సైంటిస్ట్ డా. గంగాధర్ రైతుల సమస్యలు అడిగి తెలుసుకొని, వాటికి పరిష్కారాలు, కొత్త పంట రకాల వివరాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. డా. శ్రీరంగ పాడి పశువుల నిర్వహణపై ఉత్తమ యాజమాన్య పద్ధతులు వివరించగా, డా. నిహారిక మహిళలకు విలువ ఆధారిత పదార్థాలపై అవగాహన కల్పించారు. సైలజా, కృష్ణా ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..