పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించాలి-బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ

Mana News, శ్రీకాళహస్తి.:-ప్రపంచానికి పెను ప్రమాదకరంగా మారిన వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించాలని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. కాశ్మీర్ లోని పహల్గమ్ లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీ వాసులైన చంద్రమౌళి, మధుసూధనరావులు మరణించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈరోజు స్థానిక పూసల వీధి కూడలిలో వారి చిత్రపటాల ముందు కొవ్వొత్తులను వెలిగించి నివాళులు అర్పించారు. ఉగ్రవాద దాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కార్యక్రమంలో పాల్గొన్నవారు మాటిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ సమాజానికి పెను ముప్పుగా పరిణమించిన తీవ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయకపోతే అది మానవ మనుగడను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. కాబట్టి,ప్రపంచ లోని ఏ ప్రాంతంలో నైనా తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ప్రతీ ఒక్కరూ సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి వారి గురవారెడ్డి,రాష్ట్ర కార్యదర్శులు దశరధాచారి,వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, సీనియర్ నాయకులు లక్కమనేని మధుబాబు, పేట బాలాజీ రెడ్డి, రాజేంద్రప్రసాద్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి,తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, బిసి విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడు దొరైరాజ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, మైనారిటీ విభాగం తిరుపతి పార్లమెంటు నాయకుడు సయ్యద్ చాంద్ బాషా, నూర్ మొహమ్మద్, షేక్ రియాజ్, సులేమాన్, బిసి విభాగం నాయకులు భాస్కర్, మణి, వినయ్, మునెయ్య, సోము, చంద్ర, కృష్ణమూర్తి, రఫీ, బిజెపి నాయకులు జలగం ముని, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///