జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయండి:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ఈ నెల 14వ తేది పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.జనసైనికులు, యువకులు,వీరమహిళలు,పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరూ సభకు హాజరై దేశంలో కనివిని రీతిలో జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ నెల12,13,14 తేదీల్లో పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిలతో సన్నాహత సమావేశాన్ని పార్లమెంట్ సమన్వయ కర్త హోదాలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన నివాసంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు.ప్రతి నియోజకవర్గం నుంచి 300 మందికి తగ్గకుండా పార్టీ నాయకులు,కార్యకర్తలు సభకు హాజరు అయ్యో ల చూడాలని ప్రాథమికంగా నిర్ణయించారు.అయితే కొంతమంది నియోజకవర్గ ఇన్చార్జీలు ఐదు వందల మందిని సభకు తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యేకు తెలిపారు.ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై సన్నాహక సమావేశంలో చర్చించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.తిరుపతి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి పిటాపురానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు అవసరమైన
ఏర్పాట్లు పైనా చర్చినట్లు ఆయన చెప్పారు.దేశ రాజకీయాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు సృష్టించినట్లే ఆవిర్భవ దినోత్సవాన్ని విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు.జనసేన చీఫ్,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలకు,కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి తోట వినూత,సత్యవేడు ఇన్చార్జి లావణ్య కుమార్,తిరుపతి నుంచి రాజా రెడ్డి,సర్వేపల్లి ఇన్చార్జి సురేష్ నాయుడు,గూడూరు ఇన్చార్జి మునిగిరిష్,వెంకటగిరి ఇన్చార్జి ప్రకాష్, సూళ్లూరుపేట ఇన్చార్జి మహబూబ్ బాషా,చంద్రగిరి ఇన్చార్జి దేవర మనోహర్,రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు తమ్మినేని వెంకటేశ్వర రావు,ఆకేపాటి సుభాషిణి,హేమకుమార్,చంద్రబాబు,మధుబాబుహరిశంకర్,పుటుకూరి ఆనంద్,విజయ్ కుమార్,తోట కృష్ణయ్య,ఆకుల వనజ తదితరులు.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ