ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా, 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

Mana News:-  ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అదే సమయంలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎన్నికల నోటిఫికేషన్. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో యనమల రామకృష్ణుడు, జంకా కృష్ణమూర్తి, బీటీ నాయుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావుల పదవీకాలం మార్చ్ నెలాఖరుతో పూర్తవుతోంది. వీటిలో జనసేన తరపున నాగబాబుకు, బీజేపీకు ఒకటి కేటాయించనున్నారు. మిగిలిన మూడు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్ధులు బరిలో దిగుతారు. టీటీపీ నుంచి ముగ్గురిలో యనమల రామకృష్ణుడికి మరో అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మిగిలిన రెండు స్థానాల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. ఇక తెలంగాణలో శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, మీర్జా హసన్ పదవీకాలం ముగియనుంది. ఇలా మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చ్ 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు ఉంటాయి. పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తేదీలు :- మార్చ్ 3 ఎన్నికల నోటిఫికేషన్ , మార్చ్ 10 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ, మార్చ్ 11 నామినేషన్ల పరిశీలన , మార్చ్ 13 నామినేషన్ల ఉపసంహరణ గడువు ,మార్చ్ 20 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ,మార్చ్ 20 సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ .

Related Posts

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

నెల్లూరులో జూన్ 8న కీర్తిశేషులు ఆనం వెంకట రెడ్డి విగ్రహా పునః ఆవిష్కరణ

మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు