రూ.15వేల కోట్ల రుణం.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు..

Ap Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ఇచ్చే రూ.15వేల కోట్ల నిధుల వినియోగంపై ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఏపీ రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్ సందర్భంగా అమరావతికి 15వేల కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల సహకారంతో ఏపీకి అందించనుంది.

ఈ క్రమంలో 15వేల కోట్లను ఎలా వినియోగిస్తామన్న దానిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంయుక్తంగా రూ.15వేల కోట్ల రుణ సహకారం అందిస్తాయన్న ప్రభుత్వం.. ఈ నిధులను ఉపయోగించి అమరావతిలో మౌలిక వసతులు కల్పిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అమరావతికి వరద ముప్పు రాకుండా ఉండేలా కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని, రోడ్లు, డక్ట్ లు, అలాగే డ్రైన్ల నిర్మాణాలు చేపట్టాలని సీఆర్డీఏను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రాజెక్టులు చేపట్టాలని సూచించింది.

మరోవైపు అమరావతి నగరాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అధికారం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే విడతల వారీగా ఈ బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నవంబర్ 11, 12 తేదీలలో వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్డీఏ కమిషనర్ ఒప్పందం చేసుకోనున్నారు.

అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడిందని చెప్పాలి. దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా వస్తాయని ఇప్పటివరకు ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి రూ.15వేల కోట్ల రుణంపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ నిధుల వినియోగం ఏ విధంగా ఉంటుంది, నిధులను ఏ విధంగా సమకూర్చుకుంటారు అనే దానికి సంబంధించి ఉత్తర్వులు విడుదలయ్యాయి. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ కలిపి రూ.15వేల కోట్లు రుణంగా ఇస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక సాయం పొందడానికి సీఆర్డీయేకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?