రూ.15వేల కోట్ల రుణం.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు..

Ap Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ఇచ్చే రూ.15వేల కోట్ల నిధుల వినియోగంపై ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఏపీ రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్ సందర్భంగా అమరావతికి 15వేల కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల సహకారంతో ఏపీకి అందించనుంది.

ఈ క్రమంలో 15వేల కోట్లను ఎలా వినియోగిస్తామన్న దానిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంయుక్తంగా రూ.15వేల కోట్ల రుణ సహకారం అందిస్తాయన్న ప్రభుత్వం.. ఈ నిధులను ఉపయోగించి అమరావతిలో మౌలిక వసతులు కల్పిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అమరావతికి వరద ముప్పు రాకుండా ఉండేలా కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని, రోడ్లు, డక్ట్ లు, అలాగే డ్రైన్ల నిర్మాణాలు చేపట్టాలని సీఆర్డీఏను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రాజెక్టులు చేపట్టాలని సూచించింది.

మరోవైపు అమరావతి నగరాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అధికారం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే విడతల వారీగా ఈ బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నవంబర్ 11, 12 తేదీలలో వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్డీఏ కమిషనర్ ఒప్పందం చేసుకోనున్నారు.

అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడిందని చెప్పాలి. దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా వస్తాయని ఇప్పటివరకు ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి రూ.15వేల కోట్ల రుణంపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ నిధుల వినియోగం ఏ విధంగా ఉంటుంది, నిధులను ఏ విధంగా సమకూర్చుకుంటారు అనే దానికి సంబంధించి ఉత్తర్వులు విడుదలయ్యాయి. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ కలిపి రూ.15వేల కోట్లు రుణంగా ఇస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక సాయం పొందడానికి సీఆర్డీయేకు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Related Posts

    ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

    మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 23 :- వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు నెల్లూరు వి ఆర్ సి సెంటర్ లో జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ….. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు…

    కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

    శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రత్యేక శ్రద్ధ, విలువైన విద్య పోటీ పరీక్షలలో ప్రథమ ఫలితాలు మాధురి విద్యాసంస్థలకే సాధ్యమని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

    ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

    • By APUROOP
    • April 24, 2025
    • 4 views
    కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

    పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

    ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    ఉగ్రవాద దాడులను నిరసిస్తూ  కొవ్వొత్తుల ర్యాలీ

    శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..