ఏపీ బడ్జెట్ రూ.2.94లక్షల కోట్లు.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..

మన న్యూస్ : AP Budget 2024 – ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. రూ. 2.98 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో.. ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అపూర్వ విజయం ఇచ్చారని, చంద్రబాబుపై ఉన్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వానిది లోపభూయిష్టమైన విధానాలు అని.. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది.. విభజనతో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా చంద్రబాబు నడిపిస్తున్నారని అన్నారు. అనేక పరిశ్రమలను చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొచ్చారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. 2019 తరువాత జరిగిన పరిణామాలు ఏపీలో చీకటి కోణం. గత ప్రభుత్వం విధ్వంసం పాలన కొనసాగించిందని పయ్యావు పేర్కొన్నారు.గత ప్రభుత్వం ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు చేయలేదు. రాబోయే 25ఏళ్ల ఆదాయాన్ని తగ్గించింది. నిధులను పక్కదారి పట్టించింది. గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులు చేయలేదు. గత ప్రభుత్వంలో రూ. 1.35లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయి. సహజ వనరులను కొల్లగొట్టారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు గత పాలకులు గండి కొట్టారు. దురుద్దేశంతో ఇసుక, ఎక్సైజ్ పాలసీలు రూపొందించారు.

ఏపీ 2024 – 25 వార్షిక బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.
ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్.
రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2.34లక్షల కోట్లు.
మూలధనం వ్యయం అంచనా రూ. 32,712 కోట్లు.
రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు.
ద్రవ్య లోటు రూ. 68,743 కోట్లు.
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19శాతం.
జీఎస్డీపీలో ద్రవ్యలోటు అంచనా 2.12 శాతం.
వ్యవసాయ బడ్జెట్ రూ. 43,402.33 కోట్లు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 11,885 కోట్లు.
ఉన్నత విద్యకు రూ. 2,326 కోట్లు కేటాయింపు.
ఆరోగ్య రంగానికి రూ. 18,421 కోట్లు కేటాయింపు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 16,739 కోట్లు కేటాయింపు.
మున్సిపల్, పట్టణాభివృద్ధికి రూ.11,490 కోట్లు కేటాయింపు.
గృహ నిర్మాణ రంగానికి రూ. 4,012 కోట్లు కేటాయింపు.
జలవనరుల నిర్వహణకు రూ. 16,705 కోట్లు.
పరిశ్రమలు, వాణిజ్యంకు రూ.3,127 కోట్లు.
ఇంధన రంగానికి రూ. 8,207 కోట్లు.
రోడ్లు, భవనాలు రూ. 9,554 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ.322 కోట్లు
పోలీస్ శాఖకు రూ. 8,495 కోట్లు.
పర్యావరణం, అటవీశాఖకు రూ.687 కోట్లు.
ఎస్సీ సంక్షేమానికి రూ. 18,497 కో్ట్లు.
ఎస్టీ సంక్షేమానికి రూ. 7,557 కోట్లు.
బీసీ సంక్షేమానికి రూ. 39,007 కోట్లు.
మైనార్టీ సంక్షేమానికి రూ.4,376 కోట్లు.
అత్యల్ప వర్గాల సంక్షేమానికి రూ. 4,376 కోట్లు.
ఉచిత సిలిండర్ పంపిణీకి రూ. 895 కోట్లు.
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం రూ. 4,285 కోట్లు.
నైపుణ్యాభివృద్ధికి రూ. 1,215 కోట్లు.
పాఠశాల విద్యకు రూ. 29,090 కోట్లు1

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?