స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలు అభివృద్ధి – స్త్రీ నిధి ఏజిఎం పి కామరాజు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5:- మహిళా సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తుందని స్త్రీ నిధి ఏజీఎం పి కామరాజు వెల్లడించారు. మంగళవారం నాడు ఆయన మహిళా సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. స్త్రీ నిధి రుణాలు విధి విధానాల గురించి మంజూరు రికవరీ గురించి మండలంలో గల మహిళా సంఘాలకు వివో లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల్లో కొంతమంది వ్యక్తిగత రుణాలు తీసుకొని పలు రకాల స్వయంగా వ్యాపారాలు, చిరు వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. వారి వ్యాపారాలు బట్టి వాళ్లకు బ్యాంకు లింకేజీ తో పాటు తగినంత రుణం మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 2025-26 పార్వతీపురం మన్యం జిల్లాలో సంవత్సరానికి గాను 86 కోట్ల రూపాయలు ప్రభుత్వం రుణాలు టార్గెట్ ఇవ్వగా సుమారు 20 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలు ఇచ్చామని తెలిపారు. ఆ సంవత్సరానికి గాను 83% రికవరీ చేపట్టడం జరిగిందని తెలిపారు.2025 -26 సంవత్సరానికి గాను మండలంలో 95 లక్షలకు గాను 25 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.2024-25 సంవత్సరానికి గాను 56 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేయగా 46 కోట్లు కేటాయించామని ఆ సంవత్సరానికి రికవరీ 96% వరకు చేశామని తెలిపారు. ఇక జిల్లాలో మొండి బకాయిలు నాలుగు మండలాల్లో రికవరీ చేయవలసి ఉందని తెలిపారు. జిల్లాలో 295 మహిళా సంఘాలు ఉండగా 975 సంఘాలకు స్త్రీ నిధి రుణాలు మంజూరు చేసామని తెలిపారు. బామిని పాచిపెంట బలిజిపేట సీతంపేట మండలాల్లో 65 సంఘాల నుంచి మొండి బకాయిలు రికవరీ చేయవలసి ఉన్నాదని ఆయన తెలిపారు. రికవరీ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయనతోపాటు సమావేశానికి డిపిఎం,ఏపీఎం, సీసీలు, వివోలు, మహిళా సంఘాలు తదితరులు హాజరయ్యారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి