తంగలాం గిరిజన గ్రామం లో పొలం పిలుస్తోంది – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 5:- ప్రకృతి సేద్యాన్ని పాటించే రైతులు రసాయన మందుల జోలికి పోకుండా కషాయాల ను ఉపయోగించి పురుగులు తెగుళ్లను అరికట్టుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. పోడు భూములలో మొక్కజొన్న పంట పండించి పురుగు మందుల పిచికారి చేసినట్లయితే తేనెటీగలు నశించి జీవ వైవిధ్యం దెబ్బతింటుందని కాబట్టి తెగుళ్లను కషాయాల ద్వారా మాత్రమే అరికట్టుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. తంగలాం మరియు వేటగాని వలస లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐ సి ఆర్ పి అప్పన్న ఆధ్వర్యంలో దశ పత్ర కషాయాన్ని తయారు చేయించారు. దశపర్ని తయారీ: – 200 లీటర్ల నీటిలో ఐదు లీటర్ల ఆవు మూత్రం ఐదు కేజీల ఆవు పేడ ఒక కేజీ వెల్లుల్లి ముద్ద అరకేజీ పసుపు కేజీ పచ్చిమిరప ముద్ద వంద గ్రాముల ఇంగువ రెండు కేజీల పొగాకు ఆకుల పొడి వేసి ఒక రోజంతా నానబెట్టి మరుసటి రోజు 10 రకాల ఆకులు ఒక్కొక్కటి రెండు కేజీలు చొప్పున బాగా దంచి నానబెట్టాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక కర్రతో కలుపుతూ 21 రోజులు ఉంచిన తర్వాత వడగట్టి ఎకరానికి ఐదు లీటర్లు చొప్పున పిచికారీ చేసుకుంటే తెగుళ్లు నివారణ జరగడమే కాకుండా పంట ఆరోగ్యంగా పెరుగుతుందని తెలిపారు. బెట్ట నివారణకు నానో యూరియా : –
గొట్టూరు వేటగాని వలస మూటకూడు తదితర పంచాయతీల పరిధిలో ఉన్న గ్రామాలలో గిరిజనులు వర్షాధార మొక్కజొన్న సాగు చేస్తున్నారు ప్రస్తుతం నేలలో తగినంత తేమ లేకపోవడం వలన ఎండ వేడిమి కి మొక్కజొన్న ఆకులు చుట్టుకుని పోతున్నాయి ఇలాంటి బట్ట వాతావరణాన్ని తట్టుకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఎకరానికి అర లీటరు నానో యూరియా పిచికారి చేసుకోవాలని వ్యవసాయ అధికారి తెలిపారు నేలలో తేమ లేనప్పుడు బస్తాల ఎరువులు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదని సూచించారు అనంతరం గ్రామాలలో ఉన్న వరి చిరుధాన్యాలు మొక్కజొన్న పంటలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సిఆర్పి సురేష్ ఐ సి ఆర్ పి లు రాజు సంజీవి మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు