అత్యవసర వైద్యసేవలపట్ల పీఎంపీలు అవగాహన కలిగిఉండాలికిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర

గూడూరు, మన న్యూస్ :- కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) గూడూరు-నాయుడుపేట డివిజన్ ఉపాధ్యక్షులు చిరమన సాయిమురళి అధ్యక్షతన బుధవారం, గూడూరు పట్టణంలోని మాయాబజారు రోడ్ లోని కెవి హాస్పిటల్స్ సమావేశ మందిరము నందు కిడ్నీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ పై అవగాహన సదస్సు జరిగినది. ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ మూత్రపిండ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.రాఘవేంద్ర మాట్లాడుతూ పీఎంపీలు మూత్రపిండ వ్యాధులపట్ల అవగాహన కలిగిఉండి గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేసి వారు కిడ్నీ వ్యాధి బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. కిడ్నీ వ్యాధులలో అధిక రక్తపోటు, కాళ్లు, చేతులు, ముఖంవాపు కలిగి ఉండడం, చిన్న పనికే అలసట, నీరసంగా ఉండడం, తరచూ మూత్ర విసర్జన చేయడం, మూత్రంలో రక్తం పడడం తదితర వ్యాధులతో బాధపడే వారికి తక్షణం వైద్య చికిత్సలు చేయాలని తెలిపారు. నారాయణ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వి.ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ గ్యాస్ ట్రబుల్ కు సంబంధించి పిత్తాశయంలో రాళ్లు, కడుపునొప్పి, పసరికలు/కామెర్లు, ఊబకాయం, మలబద్ధకం, రక్తపు వాంతులు, కడుపులో నీరు చేరడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, మింగడంలో ఇబ్బంది కలగడం లాంటి సమస్యలు ఉన్నవారు వెంటనే వైద్యున్ని సంప్రదించి, వ్యాధి నిర్ధారణ చేసుకుని మందులు వాడుకుంటూ, బలమైన పౌష్టికాహారం తీసుకోవాలన్నారు., తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకుంటున్నట్లయితే వ్యాధి ప్రబలకుండా ఉంటుందని తెలియజేశారు. అనంతరం పీ.యం.పీ నాయకులు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి, డాక్టర్ రాఘవేంద్ర, కె.వి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ త్రివిక్రమ్, డాక్టర్ కీర్తిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ ఏవో వెంకటేశ్వర్లు, డివిజన్ పిఎంపి నాయకులు సి.సాయిమురళి, షేక్ కరీముల్లా, ఈ.సాంసన్, పి.చంద్రమోహన్, టి.శంకరమ్మ డి.కవిత తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..