

మన న్యూస్ . వెదురుకుప్పం , జూలై 25 – :- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల సౌకర్యం, గ్రామీణ అభివృద్ధి, పారదర్శక పాలనకు పెద్ద పీట వేసిందని మరోసారి చాటిచెప్పిన కార్యక్రమం – “సుపరిపాలనలో తొలి అడుగు”. ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ సూచనలతో, వెదురుకుప్పం మండలంలోని బొమ్మయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురం, గగ్యారం పల్లి గ్రామాలలో జూలై 25, 2025న నిర్వహించబడింది. 📌 కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు: ప్రజలకు ప్రభుత్వ సేవల వివరాలు ఇంటి దాకా చేర్చడం, గ్రామాల్లో సమస్యలను గ్రౌండ్ లెవల్లో గుర్తించి పరిష్కరించడంపై దృష్టి, బూత్ స్థాయిలో పార్టీ మద్దతుదారులకి ధైర్యం, ఆశాభావం కల్పించడం, గ్రామీణ యువతలో నాయకత్వ సామర్థ్యాన్ని పెంచడం, పాలనలో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వెదురుకుప్పం మండలాధ్యక్షులు లోకనాథ్ రెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్, క్లస్టర్-04 ఇంచార్జ్ చంగల్ రాయ్ రెడ్డి, సీనియర్ నాయకులు యువ నాయకులు రాజగోపాల్ నాయుడు, సతీష్ నాయుడు, వార్డు మెంబర్ పయినీ, యువ నాయకులు నాగార్జున్, లక్ష్మీపతి నాయుడు, చంద్రబాబు నాయుడు, క్రాంతి కుమార్, డేరంగుల గోవింద బోయుడు, అరగొండ బాలమురళి, ఇనాం కొత్తూర్ మురళీ రెడ్డి, భాను ప్రకాష్, బూత్ కన్వీనర్ పవన్ కుమార్, సర్పంచ్ మోహన్ రెడ్డి, నాయకులు సుభాష్, ప్రసాదు, వెంకటరత్నం, ఎం.వెంకటరత్నం, భార్గవ్, బాలాజీ, రామకృష్ణయ్య, ప్రకాష్, యువ నాయకులు మునికృష్ణ, సునిల్, హేమాద్రి, కిరణ్, నరేష్, చందు, లక్ష్మయ్య, తులసి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళా నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కమిటీ, కో-బూత్ కమిటీ సభ్యులు, డేటా అనలిస్ట్ మారేపల్లి మురళీ సహా పలువురు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పాలనను ప్రజల మెట్లలోకి తీసుకురావాలన్న సంకల్పాన్ని మరోసారి నిరూపించిందని, ప్రజలు అభినందిస్తున్నారు.