

తిరుపతి, Mana News 17.07.2025 : అమర రాజా కంపెనీ సౌజన్యంతో నడిచే రాజన్న ఫౌండేషన్ మిషన్ కి వికాసిత్ భారత్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాత్ర 2047 లో భాగంగా, గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగంలో ప్రతిష్టాత్మకమైన “సి యస్ ఆర్ టైమ్స్ అవార్డ్ 2025 నీ అందుకున్నది. ఈ అవార్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి, ప్రత్యేకంగా గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో రాజన్న ఫౌండేషన్ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీ లోని లిమిరోడియన్ హోటల్ నందు ప్రముఖ సి ఎస్ ఆర్ మార్కెటింగ్ మరియు బ్రాండ్ హానాక్ సంస్థ వారిచే గ్లోబల్ సి ఎస్ ఆర్ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డుని రాజన్న ఫౌండేషన్ హెడ్ రాళ్లపల్లి సతీష్ కేంద్ర ఉపరితల మరియు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో ముఖ్యంగా రాజన్న ఫౌండేషన్ ద్వారా నిర్మించిన వాటర్ చెక్ డాన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఉచిత వైద్య సేవలు,తాగునీటి సౌకర్యాలు మరియు పశుసంవర్ధక ఆసుపత్రి ఇతర సేవలు అందించడం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి అవకాశాలను పొందడంలో రాజన్న ఫౌండేషన్ యొక్క చొరవలకి గానూ ఈ అవార్డును అందించి గౌరవించినది.
ఈ అవార్డు అందుకోవడం పట్ల రాజన్న ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు మాట్లాడుతూ “గ్రామీణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో మా సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకోవడం మాకు సంతోషంగా ఉంది, మా కార్యక్రమాలు ద్వారా గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పడతాయని మా సంస్థ ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకొని తద్వారా మా వంతు కృషి చేస్తున్నాము ముందు కూడా చేస్తుంటాము మరియు ఈ అవార్డు రావడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.
ఈ అవార్డు అందుకోవడం పట్ల అమర రాజా సంస్థల చైర్మన్ శ్రీ గల్లా జయదేవ్ గారు మాట్లాడుతూ “ఈ అవార్డు అందుకోవడం ద్వారా మా అమర రాజా రాజన్న ఫౌండేషన్ సంస్థ ద్వారా సానుకూల సామాజిక ప్రభావాన్ని సృష్టించేందుకు రాజన్న ఫౌండేషన్ యొక్క నిబద్ధతకు నిదర్శనం మరియు అదేవిధంగా రాబోవు కాలంలో రాజన్న ఫౌండేషన్ ద్వారా అనేక రంగాలలో విశిష్టమైన సేవలు అందిస్తామని” అని అన్నారు.