ఇంటర్నేషనల్ కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో డాక్టర్ బద్రి పీర్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్.కే.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ బద్రి పీర్ కుమార్ ఇటీవల తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదయినందుకు, అలాగే జాతీయ స్వచ్చంద సేవా సంస్థ అయిన తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో పద్మ డా॥ నందమూరి తారకరామరావు , భారత రత్న పి.వి నర్సింహారావు జయంతి ఉత్సవాలు-2025 పురస్కరించుకుని డాక్టర్ బద్రి పీర్ కుమార్ ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు పొందినందుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివ ప్రసాద్ తోటి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివ ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ పీర్ కుమార్ గత 25 సంవత్సరాలుగా అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తూనే నటనపై మక్కువ చూపుతూ టీవీ, నాటక రంగంలో నటిస్తూ రచయితగా కూడా గుర్తింపు పొందడంతో ఈ మధ్య కందుకూరి విశిష్ట పురస్కారము లభించిందని అదేవిధంగా ప్రస్తుతం ఎన్టీఆర్ జాతీయ అవార్డు రావడంతో తన బాధ్యత మరింత పెరుగుతుందని, విద్యా , కళారంగానికి తన వంతు సేవలు అభినందించదగినవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ కే. కోటేశ్వరరావు, శ్రీ శ్రీధర్ శర్మ, కే. రవిరాజు, శ్రీమతి లక్ష్మీ హిమబిందు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…