ఏజెన్సీ లో నేతకాని కులానికి ఏజెన్సీ చట్టాలు వర్తింపజేయాలి: తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం మారుతి నేత

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఏజెన్సీ లో పూర్వం నుండి నివసిస్తున్న నేతకాని కులస్తులకు ఏజెన్సీ చట్టాలు పూర్తి గా అమలు చేయాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది దుర్గం మారుతి నేత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బుధవారం నాడు రాళ్ళ వాగు పెద్దమ్మ తల్లి గుడి వద్ద నేతకాని చైతన్య సభ ఆ సంఘం జిల్లా ఇంచార్జీ జాడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం మారుతి మాట్లాడుతూ ఏజెన్సి లో నివసిస్తున్న మా కులస్తులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని, మా కులస్తులకు హక్కులు లేక భూమి పై, భుక్తి పై హక్కులు లేక జీవచ్చంలా బ్రతుకుతున్నారని, ఇకనైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ మొండి వైఖరిని , నిర్లక్ష్యాన్ని విడనాడాలని, మా కులస్తులకు, 1/70, పీసా చట్టాలు పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీనియర్ నాయకులు దుర్గం రమణయ్య, కోట రాజలింగం మాట్లాడుతూ మా కులస్తులకు ఏజెన్సీ చట్టాలు వర్తింప చేయాలని, పూర్వం నుండి ఇక్కడే నివసిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని కానీ మాకు చట్టాలు ఎందుకు వర్తిమజేయటం లేదో అర్థం కావడం లేదని , ఇకనైనా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని మా కులస్తులకు హక్కులు కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అలాగే ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి ఈశ్వర్ నేతకాని మాట్లాడుతూ ఏజెన్సీ లో మనకు హక్కులు కావాలంటే ప్రజలందరు ఐక్యతతో ఉద్యమాలకు సిద్ధం కావాలని, ఇకనైనా సమిష్టి తితో ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ నేతకాని సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలే శరణ్యం అని, ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం జిల్లా ఇంచార్జీ జాడి శ్రీనివాసరావు, జాడి పద్మ, కొండగుర్ల కోటేశ్వరరావు, దుర్గం కోటేశ్, రాష్ట్ర నాయకులు కాదు రాజు, జాడి నరేంద్ర, జాడి నాగరాజు, గంధర్ల నిత్యానంధం, పెగ నరేష్, తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం జిల్లా, మండల , గ్రామ నాయకులు, కుల పెద్దలు అందరూ పాల్గొన్నారు.

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి