లేబర్ కోడ్ లు కార్మిక వర్గానికి మరణ శాసనం.సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు జి. బాలసుబ్రమణ్యం.

గూడూరు ,మన న్యూస్ :- మోడీ బిజెపి ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుండి కొనసాగుతున్న 44 చట్టాలలో ముఖ్యమైన 29 చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లును కార్మిక వర్గానికి మరణశాసనంగా ఏర్పాటు చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు లోని సి.ఐ
టి.యు కార్యాలయంలో ఆదివారం ఉదయం ఏర్పాటుచేసిన ప్రజాసంఘాల విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ కోడ్ ల ద్వారా సంఘాలు పెట్టుకోవడం, కష్టతరం అవుతుందని, సంఘం బేరసారాల శక్తిని కోల్పోతాయని, యజమానికి విపరీతమైన అధికారాలు అప్పజెప్పడం అవుతుందని, సాధారణ కార్మికులకు ఈ.ఎస్.ఐ, పి.ఎఫ్ బోనస్, గ్రాడ్యుటి,పెన్షన్, అందని ద్రాక్ష పండ్లు అవుతాయని, కనీస వేతనం అమలు కాదు, క్యాంటీన్ అంబులెన్స్, లాంటి కనీస సౌకర్యాలు కూడా ఇబ్బందులు ఏర్పడతాయని, కాంట్రాక్టర్ల చెల్లింపు ఎగువేతలకు యాజమాన్యం (ప్రిన్సిపల్ ఎంప్లాయిస్) బాధ్యత వహించదని, పనిగంటలు 12 గంటలకు పెంచుతారని మహిళలు రాత్రి పూట పని చేయాలి. కార్మికుల రక్షణకు సేఫ్టీ ఆఫీసురు గాని, వెల్ఫేర్ ఆఫీసర్ గానీ, ఇకపై ఉండరని జీతాలు చెల్లింపు యజమాని దయాదాక్షన్యాల మీద ఆధారపడి ఉంటుందని, ఆయన తెలియజేశారు. ఈ ప్రమాదకరమైన కోడ్ లు రద్దు చేసేందుకు జూలై 9న దేశవ్యాప్త సమ్మెను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. పామంజి మణి అధ్యక్షతన జరిగిన సి.ఐ.టి.యు మండల విస్తృత సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బీ.వీ. రమణయ్య, ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, అంగన్వాడి అధ్యక్ష,కార్యదర్శులు ఇంద్రావతి, ప్రభావతి, ఆశ సంఘం నాయకురాలు ఉష, వి.ఆర్.ఏ సంఘం నాయకులు సుబ్బయ్య, రామయ్య, కెవిపిఎస్ నాయకులు అడపాల ప్రసాద్, ఆటో సంఘం నాయకులు భాస్కర్ రెడ్డి, మహబూబ్ బాషా, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గండికోట మధు, బండి కిష్టయ్య, జిలాని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నారాయణ, ముత్యాలయ్య, మున్సిపల్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ధారా కోటేశ్వరరావు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా