కత్తిపూడి అభివృద్ధి కార్యక్రమాల్లో కనిపించని జనసేన…

  • ఆహ్వానం లేదంటున్న జనసేన శ్రేణులు..
  • తెలుగు తమ్ముళ్ల వ్యవహారం పై పవన్‌కు ఫిర్యాదు..

శంఖవరం మన న్యూస్ (అపురూప్):- ఎన్డీఏ కూటమి పరిపాలనలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు, ఇతరత్రా ప్రభుత్వ అధికారిక కార్యకలాపాల్లో జనసేన ఊసే ఉండటం లేదని పలు ఆరోపణలు గుప్పమంటున్నాయి. తాజాగా జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ స్వగ్రామైన కత్తిపూడిలో ఇదే జరిగింది. బుధవారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో పలు ఆభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొనగా జనసేన నేతలు ఎవరూ హాజరు కాలేదు… ఏంటని ఆరా తీస్తే జనసేన నేతలకు ఎవరికీ కబురు అందలేదని‌ తెలుస్తుంది. బుధవారం నాటి కార్యక్రమంలో పాటించక పోవడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. శంఖవరం మండలం కత్తిపూడిలో ఏర్పాటు చేసిన 2 మినీ వాటర్ ట్యాంకులు, నిర్మాణం పూర్తయిన 1 సీసీ రోడ్డును ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ బుధవారం ప్రారంభించారు. అలాగే త్వరలో నిర్మాణం చేపట్టనున్న రెండు కాంక్రీటు సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసారు. తల్లికి వందనం లబ్దిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్ర పటాలకు పాలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.‌ అయితే ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా నియోజకవర్గ జనసేన పార్టీ నేతలకు గాని పార్టీ శ్రేణులకు గానీ ఏ విధమైన ఆహ్వానం అందించలేదు. ప్రోటోకాల్ నూ పాటించలేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేనలో ఒక్క కత్తిపూడి గ్రామం నుంచే జనసేన పార్టీ ముఖ్య నేతలు అంతా ఉన్నారు. రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శిగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడుగా ఉన్న మేడిసెట్టి సూర్య కిరణ్ నియోజకవర్గ పార్టీ వ్యవహారాలు చూస్తుండగా, జిల్లా పార్టీ కార్యనిర్వహక కమిటీ సభ్యుడుగా కరణం సుబ్రహ్మణ్యం, మండల పార్టీ అధ్యక్షుడుగా గాబు సుభాష్, ఇదే గ్రామం నుంచి పార్టీకి, ప్రజలకూ విశేషమైన సేవలను అందిస్తున్నారు. అటువంటి ప్రాధాన్యత కలిగిన జనసేన నేతలు అంతా కత్తిపూడి స్థానికులే కావడం, ఇదే గ్రామంలో ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాహిత కార్యక్రమాలకు ఎన్.డి.ఏ. లో భాగస్వామ్య పార్టీయైన జనసేన నేతలను ఆహ్వానించక పోవడం ద్వారా తన స్వజనుల ముందే తమ సొంత నేతలను అవమాన పరచినట్లైంది. జరిగిన అవమానం పార్టీ శ్రేణులు గుప్పిస్తున్న ప్రజలకు నియోజకవర్గం జనసేన పార్టీ నేతల వద్ద తగు సమాధానం కరువైన పరిస్థితి ఎదురైంది. ఇటువంటి అవమానకర పరిస్థితి ఇక ముందు కూడా జరగకూడదంటే పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని నియోజకవర్గం జనసేన పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమాచారం. ప్రత్తిపాడు నియోజకవర్గం లో రానున్న పరిపాలనలో జనసేన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది వేచి చూడాల్సిందే మరి…

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 5 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 5 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ