

- ప్రత్తిపాడు నియోజవర్గ ఎమ్మెల్యే సత్య ప్రభ రాజా
శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- పిల్లలను చదివించే తల్లిదండ్రులకు భారం కాకూడదని తల్లికి వందనం ద్వారా ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) ఆధ్వర్యంలో తల్లికి వందనం లబ్ధిదారులైన మహిళలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సత్య ప్రభ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తల్లికి వందనం విజయవంతం అయిన సందర్భంగా నియోజవర్గ వ్యాప్తంగా మహిళలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా తల్లికి వందనం అమలు చేసిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చెందుతుందని ఆమె అన్నారు. సుమారు 67 .27 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం అమలు చేయడం జరిగింది అన్నారు.. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి ఇవ్వడం జరిగిందని, ఈ పథకం ని గర్వించదగిన విషయం అన్నారు.విద్యా వ్యవస్థ ను ఈ రాష్ట్రంలో ప్రగతి పథంలో నడిపిస్తున్న అన్నారు. ఈ ఘనత మంత్రివర్యులు నారా లోకేష్ చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్, ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బద్ది రామారావు, కత్తిపూడి మాజీ ఎంపీటీసీ సభ్యులు సాధనాల లక్ష్మీబాబు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..