సర్వే వివరాలు పకడ్బందీగా ఆన్లైన్ చేయాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో ఈ నెల 9 నుంచి చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో స్వీకరించిన కుటుంబాల వివరాలను అత్యంత పకడ్బందీగా ఆన్లైన్ లో నమోదు చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై తగు సూచనలు చేశారు. జిల్లాలో సర్వే విజయవంతంగా జరుగుతుందని, అదే తరహాలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆన్లైన్ లో ప్రతి కుటుంబ వివరాలను నమోదు చేసేందుకు చర్యలు చేపట్టబోతున్నామని చెప్పారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు అత్యంత కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. కుటుంబాల వివరాలు అంశాల వారీగా ప్రత్యేక ఫార్మేట్ లో నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. అంశాల వారీగా ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ఆన్లైన్ లో నమోదు చేయాల్సిన బాధ్యత ఆపరేటర్ల పై ఉందని అన్నారు. ఒక్కొక్క ఆపరేటర్ కు నిర్దేశించిన కుటుంబాల సంఖ్య ఆధారంగా ఆన్లైన్ లో వారి వివరాలను నమోదు చేస్తారని చెప్పారు. వివరాలను ఆన్లైన్ నమోదు ప్రక్రియను సూపర్వైజర్లు, ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆన్లైన్ నమోదు ప్రక్రియ విషయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, మాస్టర్ ట్రైనీలు పాల్గొన్నారు….

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం