Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 21)మన న్యూస్ :- విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాలను నడుపుతున్న మోషన్ హైదరాబాద్ ఫోల్కె స్కూల్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బిజెవైఎం రాష్ట్ర నాయకులు రాగిరి సాయిరాం గౌడ్ గురువారం మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారని దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని దీంతో తక్షణమే మోషన్ హైదరాబాద్ ఫోల్కె స్కూల్ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని సాయిరాం గౌడ్ మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశారు.దీంతో స్పందించిన మండల విద్యాధికారి తక్షణమే నోటీసులు జారీ చేస్తామని తప్పకుండా సదరు పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.







