“పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చేతుల మీదుగా మొరుంపల్లి – ఐరాల చిన్నగొల్లపల్లి మధ్య బీటీ రోడ్డుకు శంకుస్థాపన..”

ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం..

“అభివృద్ధి మాటలకు పరిమితం కాకుండా చేతుల్లో చూపిస్తున్నాం..”

“పూతలపట్టు శాసనసభ్యులు డా..కలికిరి మురళీమోహన్.. “

మన న్యూస్ ఐరాల మండలం మే-14:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, మొరుంపల్లి గ్రామం వద్ద నూతనంగా బీటీ రోడ్డుకు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ భూమి పూజ చేశారు. బుధవారం ఉదయం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్కి ఐరాల మండల టిడిపి అధ్యక్షులు గిరిధర్ బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరి చేతుల మీదుగా మొరంపల్లె గ్రామం నుండి ఐరాల చిన్నగొల్లపల్లె గ్రామానికి 35 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్డుకు భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే స్ధానిక గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాల అమలుపై ఆరా తీశారు. గ్రామాల్లోని సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకుని రావాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతోనే పూతలపట్టు నియోజకవర్గానికి విస్తృతంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని రహదారులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. దీని ద్వారా గ్రామాల్లో ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్ధానాలు చేరుకునే అవకాశంతో పాటు గ్రామాల మధ్య రవాణా వేగవంతం అవుతుందన్నారు. అలాగే మండలాల్లో ఏ ప్రాంతానికైనా సంబంధించి సమస్యలు ఉంటే, సంబంధిత ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. “ప్రజల అభివృద్ధే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ప్రతి గ్రామానికి మంచి రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, వైద్యం, విద్యా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి అనేది కేవలం మాటలకు కాకుండా చేతల్లో చూపించాలన్నదే తన లక్ష్యమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల టిడిపి అధ్యక్షులు గిరిధర్ బాబు, చిత్తూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు హరిబాబు నాయుడు, మొరంపల్లె స్ధానిక నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, దిలీప్ రెడ్డి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, స్ధానిక గ్రామస్తులు పాల్గోన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!