

మన న్యూస్, తిరుపతి:- కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనాలను గతంలో ఏ విధంగా అయితే విఐపి సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నారో అదే తరహాలో ఇకపై కూడా టీటీడీ వారు ప్రత్యేక లేఖలను స్వీకరించుటకు నిర్ణయం తీసుకున్నారు..తదనగుణంగా వీఐపీ లేఖలను యధావిధిగా అనుమతించటానికి అవసరమైన చర్యలను చేపడుతున్నాం. ఈ నెల 15వ తేదీ నుండి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై ఇకపై బ్రేక్ దర్శనాలను యధావిధిగా కేటాయిస్తూ పునః ప్రారంభిస్తున్నాం.