- వారాహిమాతను దర్శించుకున్న 87 వైయస్సార్సీపి సీనియర్ నాయకులు:

కూర్మన్నపాలెం మన ధ్యాస ప్రతినిధి జూలై 22:జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి ఈ సేవ గ్రౌండ్లో పండితులు శ్రీ వెంకట హరీష్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు అమ్మవారి నవరాత్రి హోమాలు.ఈ కార్యక్రమాలు ఆషాడ మాసంను వేద మాసం అని కూడా అంటారు.ఆషాడ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులకి ప్రత్యేక విశిష్టత ఉన్నాది శ్రీ విద్యా సంప్రదాయాల మనకు నాలుగు రకాలుగా నవరాత్రులు ఉన్నాయి.ఆషాడశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు9 రాత్రుల ని వారాహి నవరాత్రులు అంటారు.ఈ నెల15నుండి24వ తారీఖు వరకు ఈ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.ఈరోజు 8వ రోజు సందర్భంగా వారాహి దేవికి ప్రత్యంగిరా దేవికి అత్యంత ప్రీతికరమైన విశేష స్వేత కూష్మాండ అలంకరణ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా87వ వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రగడ వేణు బాబు,ఎన్నేటిరమణ, ఇల్లపు రాము,ముద్దపు దామోదర్,దుగ్గపుదానప్పలు, అప్పిని సన్యాసిరావు,బుల్లెట్ రమణ,అముజుల వెంకటరమణ,సబ్బవరపు ఈశ్వరరావు,దాసరి ఆప్పుడు ,ప్రగడ రాము భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.