ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి.

మన న్యూస్, నారాయణ పేట: ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా తెలిపారు. మక్తల్ మండల పరిధిలోని కార్ని గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మక్తల్ నియోజకవర్గం వైద్య , విద్యకు వెనుకబడిన ప్రాంతమని ఇక్కడి ప్రజలు చాలా బిదరికానికి చెందిన వారని ఇటువంటి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకొవాలని,తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేటట్లు నిరంతరం శ్రమిస్తూ నేడు ఎమ్మెల్యే గారి సహకారంతో రామ్ రెడ్డి లయన్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వాకిటి శ్రీహరి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో మక్తల్ మండలం కర్ని గ్రామంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. 100 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించగా 45 మందికి పైన కంటిపుర సమస్యలు ఉన్నట్లు గుర్తించి వారిని ఆపరేషన్ నిమిత్తం మహబూబ్నగర్ రామ్ రెడ్డి లయన్స్ హాస్పిటల్కు ప్రత్యేక వాహనంలో తరలించడం జరిగిందన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నియోజకవర్గంలో ప్రతి మండలంలో కంటి వైద్య శిబిరాలతో పాటు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడంలో ఎమ్మెల్యే గారి సహకారం పట్ల కర్ల గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు. కంటి చూపు లోపం ఉన్నవారికి వయవృద్ధులైనటువంటి వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ కంటి ఆపరేషన్తో పాటు ఉచితంగా మందులు అద్దాలు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాసం నరసింహ, పోతురాజు లక్ష్మయ్య, మల్లేష్,శీను, ఆకాశరాములు,మైబు, ఏ రవికుమార్, నూరుద్దీన్, అసుముద్దీన్, బోయ, నరసింహ, ఆఫ్రోజ్,సద్దాం తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ