భారాస రజతోత్సవ మహాసభ విజయవంతం చేయాలి. మాజీ సీఎం కేసీఆర్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,భారాస రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ నిజామాబాద్, జిల్లాల ముఖ్య నేతలతో బుధవారం ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ నెల 27న జరగనున్న భారాస రజతోత్సవ సభ ఏర్పాట్లపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మహాసభ ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలన్నారు.మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని నేతలకు సూచించారు.
ఈ సమావేశంలో భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి,గణేశ్ గుప్తా,జాజుల సురేందర్,హన్మంత్ షిండే, గంప గోవర్ధన్ ,నేతలు అయేషా ఫాతిమా, ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    ఆంధ్రప్రదేశ్ : (మనద్యాస న్యూస్ ) ప్రతినిధి, నాగరాజు :///// కొత్త జిల్లాల కోసం ఉపసంఘం ఏర్పాటు – రాజధాని పరిధిలో కొత్త జిల్లాకు అవకాశం… ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పునర్వ్యవస్థీకరణపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం పక్కన…

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ఆంధ్రప్రదేశ్ :(మన ద్యాస న్యూస్) : ప్రతినిధి నాగరాజు :/// ఆంధ్రప్రదేశ్లో నీ రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కలెక్టర్లు ను బదిలీ చేసిన ప్రభుత్వం. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఓ ఆనంద్ నీ అనంతపురం జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి