మాట నిలబెట్టుకో ముఖ్యమంత్రి: కర్నూలులో హైకోర్టు కోసం పోస్టుకార్డు ఉద్యమం

మన ధ్యాస కర్నూల్ :కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం న్యాయవాదులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, అలాగే రాష్ట్ర అసెంబ్లీకి వేల సంఖ్యలో పోస్టుకార్డులు పంపించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రాంతంలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించారని గుర్తు చేశారు. 2024లో ఎన్నికలకు ముందు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, రెండు సంవత్సరాలు గడిచినా ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ హామీని నిలబెట్టుకోవాలని, తక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు సాధన సమితి పేర్కొంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు రాయలసీమ ప్రజలందరినీ ఈ ఉద్యమంలో భాగం చేసి నిరసనను కొనసాగిస్తామని హెచ్చరించారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!