యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
శంఖవరం/డి.పోలవరం మన ధ్యాస ప్రతినిధి:- బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే లక్ష్యంతో డి ఎఫ్ ఎస్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డి పోలవరం బ్రాంచ్ మేనేజర్ ఈశ్వరరావు గారు అన్నారు. జూలై 1వ తేదీ నుంచి మూడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFS) స్యాచురేషన్ క్యాంపు కార్యక్రమం కాకినాడ జిల్లా దీపోలవరం గ్రామంలో స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత సమర్థవంతంగా చేరాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డ్, యూనియన్ బ్యాంక్ సమన్వయంతో నిర్వహిస్తోంది.ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ ఈశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు అందని వర్గాలకు సేవలు చేరువ చేయడం, ఇప్పటివరకు ఖాతా లేని వారికి కొత్త ఖాతాల ఓపెనింగ్, తేలికపాటి కారణాలతో నిలిచిపోయిన (inactive) అకౌంట్లను తిరిగి యాక్టివ్ చేయడం, పీఎం ఎస్బీవై (PM-SBY), పీఎం జెజెబీవై (PM-JJBY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి కేంద్ర ప్రభుత్వ బ్రహ్మ పథకాలపై అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియ జరగడం వంటి కార్యక్రమాలు అమలయ్యాయి.కాకినాడ జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీల్లో ఈ డిఎఫ్ఎస్ క్యాంపులు మూడు నెలల పాటు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాకినాడ పరిధిలోగల అన్ని బ్యాంక్ బ్రాంచ్ లలో ప్రతి శుక్రవారం ఈ స్యాచురేషన్ క్యాంపు నిర్వహించనున్నట్లు డిఎఫ్ఎస్ అధికారులు తెలిపారు. ఈ క్యాంపులు ద్వారా గ్రామస్తుల బ్యాంకింగ్ అవసరాలపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రతి ఒక్కరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. అంతేకాకుండా జనదన్ (pmjdy) ఖాతాదారులు ఇతర ఖాతాదారులు రీకేవైసీ( re kyc), నామిని అప్డేట్ చేయించుకోవాలని తెలిపారు .అన్ని బ్యాంకుల సహకారంతో వివిధ గ్రామాల్లో క్యాంపులు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. అనంతరం ఇటీవల కాలంలో నల్లా ఆదినారాయణమ్మ ప్రమాదవశాస్తు మరణించగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం లో రెండు లక్షల రూపాయల చెక్కును,. బొడ్డు నూకరత్నం అనే మహిళ అనారోగ్యం సంభవించడంతో మరణించగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా రెండు లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దలు పలక సోమేశ్వరరావు, తుని సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్లు రమణ బాబు, రాజేశ్వరి చేతుల మీదుగా అందజేశారు.ఈ క్యాంపులో యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఈశ్వరరావు మరియు వెలుగు సిసి సత్యనారాయణ . డ్వాక్రా యానిమేటర్లు రైతులు . మహిళ లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







