ఉరవకొండ, మన న్యూస్:వ్యాసాపురం, గ్రామానికి చెందిన టీడీపీ, సీనియర్ నాయకుడు కొంకా పర్వతప్ప (96) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మాజీ సర్పంచు, టీడీపీ సీనియర్ నాయకుడు కొంకా సీతారాములు తండ్రి.పర్వతప్ప గారు గ్రామానికి సామాజిక సేవలో విస్తృత సేవలందించారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన వ్యాసాపురంలో నిర్వహించనున్నారు. శ్రీ కొంకా పర్వతప్ప మృతిపట్ల సీనియర్ పాత్రికేయులు, కాకతీయ సేవా సమితి తాలూకా అధ్యక్షులు మాలపాటి శ్రీనివాసులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *