

గూడూరు, మన న్యూస్ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద అసభ్యకర వాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చెయ్యాలికోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం.శ్రావణి రెడ్డి.నల్లపురెడ్డి కుటుంబానికి ప్రసన్నకుమార్ రెడ్డి కళంకం తెచ్చాడు.సమాజానికి మంచి చేస్తూ, సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న వేమిరెడ్డి కుటుంబం పై ఇలాంటి అసభ్య పదజాలాలతో వ్యాఖ్యలు చేయడం దారుణం.ప్రజా ప్రతినిధులుగా ఇలాంటి భాష ఎవరన్నా వాడుతారా, దేవతలా పూజించాల్సిన మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం నీచాతి నీచం.తల్లిని, చెల్లిని గాలికి వదిలేసిన వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి లక్షణాలను నియోజకవర్గాల్లో నేతలు అలవర్చుకున్నారు, మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడడం వైకాపా నాయకుల డీఎన్ఏ లో ఉంది,ఆ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి నేడు ప్రసన్నకుమార్ రెడ్డి దాకా ఇదే తీరు.రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి అసభ్య పదజాలాలు వాడడం వైసిపి నేతలకే చెల్లుతుంది.దేవాలయం లాంటి అసెంబ్లీ లో మహిళలను కించపరుస్తూ బూతులు మాట్లాడిన నీచ చరిత్ర ఈ వైకాపా నాయకులది,ఒక మహిళ చేతిలో ఓటమి ప్రసన్నకుమార్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నాడు.ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు మీ బూతుల పాలన అవినీతి పాలన చూసి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అయినా మీ బుద్ధి మారలేదు. ప్రశాంతి రెడ్డి గారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని, ప్రసన్నకుమార్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి లేకపోతే మహిళల చేతిలో చెప్పు దెబ్బలు ఖాయమని మట్టం. శ్రావణి రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లీలావతి, రూరల్ అధ్యక్షురాలు మల్లి.శ్యామల,మాజీ కౌన్సిలరు కల్పన,సుబ్బమ్మ,విజయమ్మ,అంకమ్మ పాల్గొన్నారు.