పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి

గూడూరు, మన న్యూస్ :- ప్రభుత్వం అనేక పేర్లతో విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచిందని దీని వలన పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజక వర్గ కార్యదర్శి శశి కుమార్ అన్నారు. శనివారం విద్యుత్ చార్జీల ధరలు తగ్గించాలని గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలన్నారు. అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సివిఆర్ కుమార్, సీపీఐ చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి కె. నారాయణ , ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా, మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు రాఘవయ్య, యాకోబు, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం..!

కొండాపురం,,మనన్యూస్ : కొండాపురం మండలం సాయి పేట గ్రామానికి చెందిన బృగుమల మహేష్ ఇటీవల విద్యుత్ ఘాతుకంతో షాక్ కు గురై రెండు చేతులు కాళ్లు, చచ్చుబడిపోయి, మంచానికి పరిమితమై చికిత్స పొందుతున్నారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న ఉదయగిరి…

రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.

విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.

ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం..!

ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం..!

రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ