

మన న్యూస్ పార్వతీపురం జూలై 5:- పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు డిమాండ్ చేశారు, పార్వతీపురం లో ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ మన్యం జిల్లా సమితి ఆధ్వర్యన రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలనీ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలి, అదానీతో , సెకీ సంస్థలతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకొస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని అదాని, సెకీ సంస్థలతో విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో విద్యుత్ చార్జీలను మూడుసార్లు పెంచి ప్రజలపై 15,487 కోట్లను భారం వేయడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను చెల్లించుకోలేక గృహ వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటే మరల విద్యుత్ చార్జీలు పెంచడం శోచనీయం అని ఎద్దేవా చేశారు, ఇప్పటికే ఇంటి పన్నులు నీటి చార్జీలు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే మరలా విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలు మరచి కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్లాది రూపాయల ప్రజల కష్టార్జితాన్ని దారాదత్తం దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం విధానాలపై అవలంబిస్తుందని స్పష్టం చేశారు. విద్యుత్ ఒప్పందాలు రద్దుకై, పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించేవరకు కలిసొచ్చిన వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల తో కలిపి ప్రజలను ఐక్యం చేసి పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య, ఈవీ నాయుడు, కూరంగి గోపీ నాయుడు, జిల్లా సమితి బీటి నాయుడు, సాలాపు అనంత రావు, సింహాద్రి దుర్గారావు, సింహాద్రి కిరణ్, పాల్గొన్నారు.
