ఉరవకొండ మన న్యూస్ జులై 4:– లక్కీషా బంజారా 445వ జయంతి సందర్భంగా బంజారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారా యోధుడు లక్కీషా బంజారా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన బంజారా ఫౌండేషన్ ఛైర్మన్ కమల్ సింగ్ రాథోడ్ అయనఅట్లాడుతూ లక్కీషా బంజారా, బంజారా రాజు 4 జులై 1580లో ఢిల్లీ సమీపంలోని రాయిసేనా తండాలో గోదు నాయక్, సోమ్లీ బాయి దంపతులకు జన్మించారు ఈయన గొప్ప ధైర్య సాహసం గల బాలయోధుడు,వీర యోధుడు, ధనికుడు, పేద ప్రజల పెన్నిధి ఆసియా ఖండలోనే ఏకైనా అతి పెద్ద వ్యాపారవేత్త ఆయనకు ఢిల్లీ, పాకిస్తాన్, దేశాల్లో వేల ఎకరాలకు అధిపతి, అయన దగ్గర లక్షల సంఖ్యలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఆవులు, ఎడ్ల బండ్లు ఉండేవారని అందుకే ఆయనకు లాఖా బంజారా, లక్కీషా బంజారా అనే పేర్లుతో పిలుస్తారని తెలిపారు, ఆయనకు ఇతర దేశాలకు యుద్ధ సామాగ్రి, ఆహార ధాన్యలు రవాణా చేసేవారని తెలిపారు మొఘల్ సామ్రాజ్య రాజు ఔరాంగజేబు మత మార్పిడి విధానాన్ని వ్యతికరించిన ఏకైక భారత రాజు లక్కీషా బంజారా అని తెలిపారు, సిక్కుల తోమ్మిదోవ గురు తేజ్ బహుదూర్ మత మార్పిడికి నిరాకరించడతో మొఘల్ రాజు తలను, మండెమును రెండుగా చేసి చాందీని చౌక్ వేలాడదీసి మొఘల్ రాజు ఆజ్ఞ ప్రకారం అయన పార్థివాదేహాన్ని అంతిమ సంస్కారం చేసిన వారికీ కూడా ఇదే శిక్ష వేయబడును అని హుక్కా జారీ చేసిన లక్కీషా బంజారా లెక్కచేయకుండా మొఘల్ సైన్యంతో పోరాడి తేజ్ బహుదూర్ పార్థివదేహాన్ని అంతిమ సంస్కార చేసిన బంజారా యోధుడు లక్కీషా బంజారా అని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *