

పొదలకూరు , మన న్యూస్ , జూన్ 28: పొదలకూరు మండలంలోని బిరదవోలు చెర్లోపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు మన్నూరు కృష్ణంనాయుడు, అన్నంగి రమణయ్యలు ఒక్కరోజే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సందర్భంలో సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారు వారి భౌతికకాయాలకు వెళ్లి పుష్పాంజలి అర్పించి గౌరవనివాళులర్పించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి గారు మాట్లాడుతూ –
“తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పాటు ఎనలేని అభిమానాన్ని చూపిస్తూ పార్టీ విజయానికి అజస్రంగా కృషి చేసిన వీరాభిమానులు ఇద్దరూ ఒకే రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టడం ఎంతో విచారకరం. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను,” అని అన్నారు. పార్టీ స్థాపకుని ఆదేశాల కోసం ఎదురు చూసే నిస్వార్ధ కార్యకర్తలు, ప్రజల కష్టాల్లో ముందుండే మానవతావాదులు మన్నూరు కృష్ణంనాయుడు, అన్నంగి రమణయ్యలు అకాలమరణం పాలవ్వడం పార్టీలో ఆవేదన కలిగించిన విషయమని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొని కన్నీరుపరిచారు.
