

మన న్యూస్, తిరుపతి : 2018లో 6 లక్షల మందికి ‘నిరుద్యోగ భృతి’ ఇస్తే వైసిపి ప్రభుత్వం లోకి రాగానే ఒక్క కలం పోటుతో రద్దు చేసిన జగన్, ఈ రోజు నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వలేదని వైసీపీ ధర్నా అట …! వైసీపీ ….మీరున్నప్పుడు ఏమి చేశారు? ఎందుకివ్వలేదు ? వైసీపీ ప్రభుత్వంలో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా, మేము వచ్చి 17 వేల టీచర్ ఉద్యోగులు ఇస్తుంటే, కొన్ని లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు వస్తుంటే ….. ధర్నా చేస్తుంటే అర్థమేమిటి? వైసీపీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో ఇంజనీరింగ్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 3400 కోట్లు బకాయిలు పెట్టేసి వెళ్లిపోయిన వాళ్ళు ఈ రోజు రీఎంబర్స్మెంట్ కోసం ధర్నాలు చేస్తారట, వీళ్ళు చేసిన బకాయిలు టీడీపీ తీరుస్తున్న విషయం మర్చిపోయినట్టున్నారు.
వైసీపీ ….మీరున్నప్పుడు ఏమి చేశారు? ఎందుకివ్వలేదు?అప్పుడేమీ చేయకుండా ఇప్పుడు ధర్నాలు ఏంటి ?
ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఈ ధర్నాలు గురించి ..! అని వారు పేరుకొన్నారు